Home » Raptadu
రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కుంటిమద్ది చెరువును ఆమె పరిశీలించి, గంగపూజ చేశారు.
మండలకేంద్రంలో సోమవారం శివపార్వతుల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత స్థానిక మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకులు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు చేశారు.
మండలంలోని రాచానపల్లి గ్రామ సమీపంలో సోమవారం అక్కమ్మ గార్ల పరుష ఘనంగా సాగింది. గుడికట్టు వారు స్థానిక ఆలయంలోని అక్కమ్మ గార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో ఉన్న భూ సమస్యలకు వేగంగా పరిష్కా రం చూపించాలని ఆర్డీఓ మహేశకు ఎమ్మెల్యే పరిటాలసునీత విజ్ఞప్తిచే శారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఽసోమవారం స్థాని క ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన రెవిన్యూ క్లినిక్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత వచ్చారు.
త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు ప్రారంభం అవుతాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె మాట్లాడుతూ... పేరూరు ప్రాజెక్టుకు హంద్రీనీవా ద్వారా నీరు అందించే పనులకు 2018లో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం మాదిరిగా.. ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోవడం విశేషం. వివరాలిలా ఉన్నాయి.
నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై బిజీబిజీగా ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత ఒక్కరోజు తన పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వెంకటాపురం వద్దగల తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం చలిలోనే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అప్పుడే పనుల్లోకి వస్తున్న కూలీలతో మమేకమయ్యారు.
మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో రైతు బాసి నారాయణకు చెందిన వ్యవసాయపొలంలో శనివారం మధ్యాహ్నం విద్యుతషార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది.
చిన్నారులకు అక్షరాలు దిద్దిస్తూ వారి బాగోగులను చూసుకునే అంగనవాడీ కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టించిన ఘనత వైసీపీదేనని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు.
ఏడాదిన్నర కాలంలోనే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజు ల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని తూముచెర్లలో బుధవారం ఆమె పర్యటించారు.