Home » Raptadu
నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై బిజీబిజీగా ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత ఒక్కరోజు తన పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వెంకటాపురం వద్దగల తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం చలిలోనే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అప్పుడే పనుల్లోకి వస్తున్న కూలీలతో మమేకమయ్యారు.
మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో రైతు బాసి నారాయణకు చెందిన వ్యవసాయపొలంలో శనివారం మధ్యాహ్నం విద్యుతషార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది.
చిన్నారులకు అక్షరాలు దిద్దిస్తూ వారి బాగోగులను చూసుకునే అంగనవాడీ కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టించిన ఘనత వైసీపీదేనని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు.
ఏడాదిన్నర కాలంలోనే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజు ల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని తూముచెర్లలో బుధవారం ఆమె పర్యటించారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డివి మాటల్లో కోతలు తప్పా... చేతల్లో అభివృద్ధి ఎక్కడా చూపించలేని దద్దమ్మ.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే లేపాయి.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు ఓ సూచన చేశారు. రైతులంతా ఒకేసారి ఒకే రకం పంట సాగుచేస్తే గిట్టుబాటు ధరలేక నష్టాలు వస్తున్నాయని, కాబట్టి ఒకే రకం పంట కాకుండా మర్పిడి చేసుకోవాలని ఆమె సూచించారు.
రేమండ్స్ పరిశ్రమ రాకతో రాప్తాడు భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. జాకీ పరిశ్రమ స్థానంలో రేమండ్స్ వస్త్ర పరిశ్రమ మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు.
‘మా ప్రాణం మీరే.. మీరే మమ్మల్ని ముందుండి నడిపించారు. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసమే పనిచేస్తామ’ని టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కక్కలపల్లి క్రాస్లో గల ఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం టీడీపీ నియోజకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది.
మండలకేంద్రంలోని ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి)పై మరో 20 రోజుల్లో వాహనాల రాకపోకలు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత వెల్లడించారు. ఆ బ్రిడ్జి పనులను ఆమె నేషనల్హైవే అధికారులు, కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.
విస్తృతస్థాయి సమవేశానికి పూర్తి సమాచారంతో కాకుండా నిర్లక్ష్యంగా వస్తే చర్యలు తప్పవని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి పరిధిలోని సొసైటీల సీఈఓలు, బ్యాంకుల అధికారులు, ఉద్యోగులపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.