Home » Rajastan Royals
ఐపీఎల్-2024లో ఫైనల్ చేరనున్న మరో జట్టు ఏది?... ఈ ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రానుంది. ఫైనల్లో చోటే లక్ష్యంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ షురూ అయ్యింది.
ఆదివారం చెన్నైలో జరిగే ఐపీఎల్-2024 ఫైనల్ మ్యాచ్లో కోల్కతాను ఢీకొట్టే జట్టేది? ఆ సస్పెన్స్కు మరికొద్ది గంటల్లో సమాధానం దొరకనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం జరగబోయే క్వాలిఫయర్-2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబద్ జట్లు తలపడబోతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో రేపు కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడితే ఫైనల్స్కు ఏ జట్టు చేరుతుందో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్-2024లో (IPL 2024) మరో కీలక సమరానికి తెరలేచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ (RCB vs RR) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ ఆడనున్న నాలుగు జట్లు ఖరారయ్యాయి. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించడంతో నాలుగవ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమైంది. కానీ 2, 3 స్థానాల్లో నిలిచే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఐపీఎల్-2024 సీజన్లో టేబుల్ టాపర్గా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చతికిలపడ్డారు. గువహటి వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగారు.
పార్టీ స్థాపించి అతితక్కువ కాలంలోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆప్. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో తిహార్ జైల్లో ఉన్నారు. ఎన్నికలలో వినూత్నంగా ప్రచారం చేసి.. సక్సెస్ సాధించడంలో అరవింద్ కేజ్రీవాల్ ముందువరుసలో ఉంటారు. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి రావడానికి ఆయన ప్రచార వ్యూహం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజలందరినీ ఆకర్షించేలా ప్రచారం చేయడంలో ఆయన ముందుంటారు.
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్లా నిలిచాడు. మంచి ఫామ్లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో సన్రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచులో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(kavya maran) ఆనందంతో ఎగిరి గంతేశారు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 50వ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. అయితే చెన్నై, బెంగళూరు చేతిలో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది.