Home » Rains
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 'ఆరెంజ్, ఎల్లో అలెర్ట్' జారీచేసింది.
హైదరాబాద్ మహానగరంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాజధాని హైదరాబాద్తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వరుసగా నాలుగు రోజులు ఈ వర్షాలు పడతాయని తెలిపింది.
తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన ఎల్-నినో ప్రభావం, పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) పరిస్థితుల కారణంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేసింది.
కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మారే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ వచ్చింది. రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ నుంచి మన్నార్ జలసంధి వరకు ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది.
భారత్లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతువపనాలు కొనసాగే వర్షాకాలం రెండో భాగమైన జూన్-సెప్టెంబర్లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది.
కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.