Home » Rains
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణీ విస్తరించిందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
తూర్పు విదర్భ - తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అలాగే ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 'హై అలర్ట్' ప్రకటించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
భాగ్యనగరంలో వచ్చే మరికొన్ని గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర ఎండలు, హీట్వేవ్ ప్రభావం కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. జూన్ 11వ తేదీకి రాష్ట్రంలో రుతుపవనాల పురోగతి కొనసాగుతోందని వెల్లడించారు.