Home » Rains
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు చిరు చినుకులు ( Rains ) ఉపశమనం కలిగించాయి.
వేసవి ప్రారంభానికే ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ( Telangana ) కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు దాటేసింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించేలా వడగాలులు వీచాయి.
రైతాంగానికి చల్లని కబురు... గతేడాది వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ సారి నిర్ణీత తేదీకంటే ముందుగానే రానున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిన సూపర్ ఎల్నినో క్షీణత వేగంగా సాగుతుండడంతో.. వచ్చేనెల నాటికి తటస్థ పరిస్థితులు, జూన్కల్లా లానినా దశ ప్రారంభమవుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలుఅంచనా వేస్తున్నాయి.
వేసవి మండిపోతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Telangana: ఒక్కటే ఎండలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. ఇంట్లో నుంచి బయటికొస్తే తిరిగి వెళ్లలేని పరిస్థితి! అలాగనీ బయటకూడా ఉండలేక ఎండలకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఏప్రిల్ మొదట్లోనే ఇలాగుంటే చివరికి.. మే నెలలో ఎండలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహకందని పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ (Telangana), హైదరాబాద్లో (Hyderabad) అసలే ఎండలు.. దీనికి తోడు వడగాలులు. ఇలా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది..
గత కొన్నిరోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని చల్లని సమాచారం ఇచ్చింది.
ఎండల తీవ్రతతో అలమటిస్తున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు రోజులపాటు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
అమరావతి: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన భారీ వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఐఎండీ సూచనల ప్రకారం జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రేపు(బుధవారం) భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Rain Alert for Andhra Pradesh and Telangana: నిన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం(Weather) మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. నల్లటి దట్టమైన మబ్బులు కమ్మేశాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్ర ప్రకటించింది.