Home » Rains
ఆంధ్రప్రదేశ్లో కురిసిన అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరిచాయి. ముఖ్యంగా నంద్యాల వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన దంచికొట్టింది.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏపీలో అకాల వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న తరుణంలో.. సోమవారం నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది..
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్తో పాటూ పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.
ఢిల్లీ NCRలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఉత్తర శ్రీలంక తీరాన్ని దాటే అవకాశముంది. ఏపీపై ప్రభావం పరిమితంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు, రైతులు, మత్స్యకారులు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం..