Home » Rains
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మంగళవారం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు, తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు..
ఈసారి మాన్సూన్ వాయవ్య భారతదేశంలో తీవ్రంగా ప్రభావం చూపించింది. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఆగస్టులో 14 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నీలగిరి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు కురిసిన వర్షానికి గూడలూరు, పందలూరు పరిసర ప్రాంతాల్లో వరద దృశ్యాలు నెలకొన్నాయి. పల్లపు ప్రాంతాలు దీవులుగా మారాయి. గూడలూరులోని ప్రధాన రహదారుల్లో మోకాలిలోతు వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతుంది. ఎగువ నుంచి వరదనీరు వచ్చి హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల్లో చేరుతుంది. ఉస్మాన్సాగర్ సామర్థ్యం మొత్తం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.25 అడుగలకు చేరింది.
తెలంగాణ వ్యాప్తంగా 2,463 గ్రామాలు వర్షాలకు ప్రభావితం అయ్యాయని.. 2,20,443 ఎకరాలు దెబ్బతిన్నాయని నివేదిక తెలిపింది. ఏకంగా 1,43,304 మంది రైతులు వానలకు నష్టపోయారని పేర్కొంది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది.
హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, అంబర్ పేట్, కాచిగూడ, ఓయూ క్యాంపస్, విద్యానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
ఐదుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసిన ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే.. 30 గంటలు గడిచిపోయాయి.
జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. జియాగూడ - పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం రామచందర్ రావు కామారెడ్డికి వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు బీజేపీ అండగా ఉండనుందని భరోసా ఇవ్వనున్నారు.