Heavy Rains: మళ్లీ పిడుగులతో పాటు భారీ వర్షాలు..
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:57 PM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది.
అమరావతి, సెప్టెంబర్ 09: ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయిన వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలు చోట్ల ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పందించారు.
పిడుగు పాటు, భారీ వర్షాలు నేపథ్యంలో గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని సూచించారు. ఇక తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలలో.. భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడ వద్దని ప్రజలకు సూచించారు. భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకార్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
ఆ ఐపీఎస్లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News