Home » Rain Alert
కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటువంటి ఆవకాశం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడురోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో సముద్ర పక్కనున్న రాష్ట్రాల్లో వాతావరణ సానుకూల పరిస్థితులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఢిల్లీ-ఎన్సిఆర్లో రోడ్లు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. యమునా నది నీటి మట్టం పెరగడంతో అధికారులు రాజధానిలో వరద హెచ్చరికలు జారీ చేశారు.
గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంలో అనేక క్లౌడ్ బరస్టులు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. నిన్న(శుక్రవారం) కూడా బండిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్లో మరో క్లౌడ్ బరస్ట్ జరగినట్లు అధికారులు తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగులు నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 2,463 గ్రామాలు వర్షాలకు ప్రభావితం అయ్యాయని.. 2,20,443 ఎకరాలు దెబ్బతిన్నాయని నివేదిక తెలిపింది. ఏకంగా 1,43,304 మంది రైతులు వానలకు నష్టపోయారని పేర్కొంది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది.
పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
ఐదుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసిన ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే.. 30 గంటలు గడిచిపోయాయి.
జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. జియాగూడ - పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం రామచందర్ రావు కామారెడ్డికి వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు బీజేపీ అండగా ఉండనుందని భరోసా ఇవ్వనున్నారు.