Home » Rain Alert
దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్పై ఈసారి ‘ఎల్నినో’ పిడుగు పడనుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు గల నాలుగు నెలల రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి.
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు బీభత్సం సృష్టించాయి.
ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన అంబర్పేట్ ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు వర్షంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కీలక హెచ్చరికలు జారీ చేశారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఆ ముగ్గురు మహిళలు అంతవరకు దొండ పంట సాగులో గడ్డితీత పనులు చేశారు. చిరు జల్లులు పడుతుండడంతో పని ఆపి ఇంటికి బయలుదేరారు. అంతలో చెట్టు కింద ఉంచిన ఖాళీ క్యారేజీలు గుర్తుకు వచ్చి తీసుకురావడానికి వెళ్లారు.