Home » Rain Alert
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. ఈ నెల 27న కేరళకు, జూన్ తొలి వారంలో తెలంగాణకు వర్షాలు వచ్చే అవకాశం.
రేపు నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని తాకనున్నాయి. రాష్ట్రంలో వడగాడ్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి తీవ్రత కొనసాగుతోంది
రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్ష సూచనను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. శనివారం 12 జిల్లాలకు, ఆదివారం 18 జిల్లాలకు రెయిన్ అలెర్ట్ను జారీ చేసింది.
క్రమంగా కురిసిన అకాల వర్షాలు, గాలివానతో రైతులకు నష్టం కలిగింది. ధాన్యాలు తడిసి రైతులు మార్కెట్లలో అవస్థలు ఎదుర్కొన్నారు.
ఈ నెల 13న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ను తాకనున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు, మరికొన్నింట్లో ఉక్కపోతతో కూడిన ఎండలు నమోదయ్యాయి
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల వరకు చేరతాయని, కొంతమంది ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తా జిల్లాలకు కూడా భారీ వర్షాలు, ఈదురుగాలులు అనుకోకుండా తీవ్రత చూపిస్తాయని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు పడనున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి.
మండువేసవిలో కురిసిన అకాల వర్షం రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం కలిగించింది. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో సహా కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించి, 8 మంది మరణించారు, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
రాష్ట్రంలో నాలుగు రోజులు ఎండావానలతో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పగలు ఎండ తీవ్రత, వడగాడ్పులు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.