Home » Puttaparthi
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ-కాపు కులస్థుల సమస్యలపై శాసనసభ స మావేశాల్లో చర్చించి పరిస్కారం చూపించాలని బలిజ సంఘం జిల్లా నాయకులు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి విన్నవించారు. అనంతపురం లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. మండల వ్యాప్తంగా రైతులు ఖరీఫ్, రబీ సీజనలో వివిధ రకాలైన కూర గాయలు, ఉద్యాన పంటలతో పాటు పూల సాగుపై మక్కువ చూ పు తున్నారు. ఈ మేరకు మండలంలో బంతి, చామంతి, కనకాంబరం, లిల్లీ తదితర రకాల పూలను సాగు చేస్తున్నారు.
మండల పరిధిలోని చిల్లవారిపల్లి సమీపంలో వెలసిన కాట కోటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సంద ర్భంగా జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్ల పనులు ఊ పందుకున్నాయి. మాఘమాసం కావడంతో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేస్తున్నా రు.
లేబర్ కోడ్లను తిప్పికొడదాం ... దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు అయూబ్ఖాన, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల పల్లి పెద్దన్న పిలుపు నిచ్చారు. దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాల యం నుంచి కళాజ్యోతి, కాలేజ్సర్కిల్, ఆర్డీసీ బస్టాండ్, సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.
మండలకేంద్రంలోని మ స్తానవలీ దర్గా ఉరుసు మహోత్సవాలు ఆదివారం జియారతతో ముగిసినట్టు ముతవల్లి మాణిక్యంబాబా తెలిపా రు. ఉరుసు మహోత్సవాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదివారం రాత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రార్థనలు చేశారు.
మండల పరిధి లోని అప్రాచెరువు గ్రామంలో వెలసిన వీరనారాయణస్వామికి గ్రామస్థుల ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో మూడు రో జుల పాటు వీరనారాయణ స్వా మికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గ్రామపెద్దలు తెలిపారు. అందులో భాగంగా ఆ దివారం ఎలవ గంపను ఊరేగిం చారు
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రహరీ లేకపోవడంతో విషపురుగుల భ యంతో విద్యార్థులు గడపాల్సి వస్తోంది. మండలంలోని కొండకమర్ల, గౌనిపల్లి, ఓబులదేవరచెరువు, మిట్టపల్లిల్లో బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి.
మండలపరిధిలోని అచ్చేమియా పల్లిలో అచ్చేమియా దర్గా ఉరుసు ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొండకమర్ల గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు జౌలీ అల్లా బకాష్ ఇంటి నుంచి ప్రత్యేకంగా ఒంటెలు, గుర్రాలపై గంధాన్ని ఫకీర్ల జల్సాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గా లోప్రార్థనలు చేశారు.
మండలంలోని రావుల చెరువు పంచాయతీలోని నాగిరెడ్డికుంట కొట్టాల గ్రామ సమీపాన ఉన్న కుంట నిండి మరువపారుతోంది. ధర్మవరం చెరువు నుంచి నీరు రావడం తో కుంట నిండింది. ఈ కుంట కింద సుమారు 50 వరకు వ్యవసాయ బోరుబావులు ఉన్నాయి.
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం మండల పరిఽధిలోని కుమ్మరవాండ్లపల్లి వద్ద స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు.