Home » Ponnam Prabhakar
లక్ష్మణ్కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్న... కరీంనగర్లో మాదిగ సామాజిక వర్గంతో నేను కలిసి పెరిగానని మంత్రి పొన్నం తెలిపారు.
అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని మండిపడ్డారు.
అడ్లూరికి క్షమాపణ చెప్పకపోతే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. ఈక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద భద్రత పెంచారు. పొన్నం ఇంటి ముందు బారికేడ్స్ను ఏర్పాటు చేశారు పోలీసులు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తనను అలా అనడం బాధ కలిగించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు తన సామాజిక వర్గాన్ని కించపరిచాయని వాపోయారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెహమత్ నగర్లో ముగ్గురు మంత్రులు.. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది.
42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సింఘ్వీ , దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు బట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి నిన్న(ఆదివారం) రాత్రే ఢిల్లీ చేరుకున్నారు.
రాష్ట హైకోర్టులో వాదనలు జరిగాయని.. ఎన్నికల నోటిఫికేషన్కు వెళ్లొచ్చని చెప్పారని మంత్రి వెల్లడించారు. హైకోర్టులో ఈకేసుపై 8వ తేదీ విచారణ జరగాల్సి ఉందని.. ఈ లోపే వారు సుప్రీంకోర్టుకు వచ్చారన్నారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్తో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్ని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపించడం జరిగిందని మంత్రి పొన్నం అన్నారు. గవర్నర్ దానిని ఆమోదించలేదని.. ఆ బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు.