Home » Politics
పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా తాను పార్టీ మారలేదని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్ధి తనతో ఎప్పుడు ఫోటో దిగారో, ఎప్పుడు మాట్లాడారో తెలియదన్నారు. నవీన్ యాదవ్కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారని అన్నారు.
చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది
కొండాపూర్లాంటి ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 2000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా శుక్రవారం కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని రాఘవేంద్ర కాలనీలో పార్కుతో పాటు.. కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 2 వేల గజాలను లే ఔట్లో చూపించారు. పార్కు స్థలం ఖాళీగా ఉండటంతో అక్రమార్కులు ఆ స్థలాన్ని కబ్జా చేయడంపై దృష్టి పెట్టారు.
కర్నూలు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. ఈ మేరకు కర్నూలు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.
హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలని హరీశ్ రావు పిటిషన్ వేశారు.
విజయవాడ-సింగపూర్ మార్గంలో నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఊరట లభించనుంది.
గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడని మండిపడ్డారు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పిందని తెలిపారు.
విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపామని వివరించారు. బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతర సంప్రదింపులు, నిశిత పరిశీలన చేస్తున్నామని తెలిపారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్షన్ చేసామని చెప్పారు. ప్రాపర్టీ అఫెన్సస్ ఎక్కువగా ఉన్నాయని.. వాటిలో పురోగతి ఆశించిన మేర లేదని చెప్పారు.