Home » Politics
ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వేరే దిక్కు లేక రైతులు ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని చెప్పారు.
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో పోస్టుమార్టం ఒకే చోట నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
మణుగూరు వివాదంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలు గుంపులు, గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు, భువనేశ్వరి లండన్ వెళ్లారు. ఈ మేరకు లండన్ తెలుగు కుటుంబాలు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు.
మణుగూరు పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేగా కాంతారావు తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
హైడ్రాపై భట్టి విక్రమార్క పీపీటీ పేరుతో 15 బిల్డర్ల పేర్లు చెప్పారని.. కానీ ఇప్పటివరకూ ఒక్కరిపై కూడా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రా(HYDRAA) చేసేది మంచే అయితే భట్టి విక్రమార్క చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవని మండిపడ్డారు.
జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షులుగా బుర్ర రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్ లను నియమిస్తున్నట్లు జాగృతి అధికారిక ఎక్స్ (X) ఖాతా వేదికగా స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పార్టీ కార్యాలయం దహనం చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.