Home » Police case
AP మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. కాశీబుగ్గలో నమోదైన హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి సోంపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బిగ్బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్తోపాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది.
తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. భూ వివాదంలో తామూ బాధితులమేనని ఆయన చెప్పుకొచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్నారు.
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ను ఏపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ను 2026 సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఐదుగురు పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.
దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 47,000 మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది.
'రేవతి'. ఈమె ఒక సామాన్య కానిస్టేబుల్. కానీ వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా, దేనికీ భయపడకుండా నిలిచి చరిత్ర సృష్టించారు. 'జస్టిస్ వర్మ'. ఈయన వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఢిల్లీ కరెన్సీ నోట్ల కట్ల కేసులో తన బాధ్యతను గుర్తించడానికి లేదా రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి ఆపసోపాలుపడ్డారు.
ప్రముఖ సింగర్ మంగ్లీ (సత్యవతి), ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగులపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో మోసం చేయడం, ప్రశ్నించిన న్యాయవాదిని చంపుతామని బెదిరించడం వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి.
ఒక వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు చెల్లిని హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే...