Home » PM Modi
ఇటీవల కొంతమంది టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త రకం మోసాలకు తెగబడుతున్నారు. ఓ వ్యక్తి ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతిల AI-జనరేటెడ్ నకిలీ వీడియోలను ప్రసారం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ ధూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శలు చేశారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పేదల హక్కులు దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయం ఉందని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. కొత్త చట్టంతో పని దినాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్కు మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఆమె తనయుడికి సంతాప లేఖ రాశారు.
రష్యాలోని నోవ్గరొడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని, 91 దీర్ఘశ్రేణి డోన్లను ఆ దేశం ప్రయోగించిందని రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ధ్రువీకరించారు.
బీద వాడి గోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే పేద వాడి పార్టీ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో మనం ఉండటం మన అదృష్టమని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ 2925లో భారత్ సాధించిన గొప్ప విజయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దీనిని మారుతున్న భారతావనిగా అభివర్ణించిన ప్రధాని, సైనిక విజయాన్ని దేశవ్యాప్తంగా దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రశంసించారు.
శ్రీ గురు గోబింద్ సింగ్ జీ మహారాజ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమని, మానవ గౌరవాన్ని కాపాడమని ప్రేరేపించారని... ధైర్యం, కరుణ, త్యాగానికి ప్రతీక..
అమరావతిలో ఒక చరిత్రను సృష్టించే విధంగా వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈనెల 11 నుంచి అటల్ మోదీ సురిపాల యాత్రను ప్రారంభించారని తెలిపారు. అమరావతిలో 14 అడుగుల వాజ్పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సీఎం తెలిపారు.
వాజ్పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్పేయ్ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.