Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దగ్గర ఒక్క ఆధారమూ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తెలిపారు. అన్నీ నిరాధారమైన ఆరోపణలు.. సొల్లు పురాణమేనని ఎద్దేవా చేశారు. ఈ కేసులో అడిగిన ప్రశ్నలే అడిగారు తప్ప.. మరేమీ లేదని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరవడంపై ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర్ స్పందించారు. రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా హరీశ్కు సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డైవర్షన్ కోసమే నోటీసులు పంపించారని ఆయన ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జైపాల్ను విచారించిన సిట్.. ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కర్త, కర్మ అన్ని ఒకరి వైపే వేలు చూపిస్తున్నాయని.. కానీ ఆయనను పిలిచేందుకు భయపడుతున్నారంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తతంగమంతా ఎన్నికల కోసం పిలుస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు ఇచ్చారు.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సుప్రీంలో సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది.