Home » Petrol Price
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం సగటున రూ. 3 పెంచిన చమురు కంపెనీలు.. సమీప భవిష్యత్తులో మరింత పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదన్నది తేలిపోయిందని సీఎం అన్నారు.
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచారు. చమురు కంపెనీలు లీటరుకు రూ.3 చొప్పున ధరలను పెంచాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపిందని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాజకీయ పార్టీలు చేసే విమర్శలు పట్టించుకోవద్దని ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల ఈ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.
పెట్రోలియం ఉత్పత్తి ధరలు పెరగవని తాను చెప్పనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. నాలుగేళ్లుగా వీటి ధరలు పెంచలేదని చెప్పారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను భారత ప్రభుత్వం సవరించింది, అయినప్పటికీ వినియోగదారులకు రిటైల్ పెట్రో ధరలు యథాతథంగా ఉంటాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఒక ప్రకటనలో తెలిపింది.
పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఇది శుభవార్త. పశ్చిమబెంగాల్ పోలింగ్ ఈనెల 29న పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను కేంద్రం కొట్టివేసింది. అలాంటి ఆలోచన ఏదీ లేదని వివరణ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా ఎదురైన పెట్రోల్, డీజిల్ కొరత సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయానికి రాష్ట్రంలోని సుమారు 90 శాతం పెట్రోల్ బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు.