Home » Penukonda
మండలపరిధిలోని గుత్తివారిపల్లి వద్దనున్న సాగర్ సిమెంటు గోడౌనపై విజిలెన్స ఎనఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడిచేసి గోడౌనను సీజ్ చేశారు. గుత్తివారిపల్లి వద్ద కొన్నేళ్లుగా కర్నూలుకు చెందిన మహేష్ అనే వ్యక్తి సాగర్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా దిగుమతులు, ఎగుమతులు సాగిస్తున్నారు.
పెనుకొండ సమీపంలో ఐదు ఎకరాల్లో గిరిజన గురుకుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని నిర్మిస్తామని మంత్రి సవిత అన్నారు. సోమవారం పట్టణంలోని వసతిగృహాన్ని ఆమె ద్విచక్రవాహనంలో వెళ్లి తనిఖీ చేశారు.
శ్రీసత్యసాయి జిల్లాలో జిల్లాలో జరిగిన రాబరీ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు వ్యక్తులు సూరత్ నుంచి బెంగుళూరుకు ఇన్నోవా కారులో తరలిస్తున్న హవాలా డబ్బును.. కొందరు దుండుగులు అడ్డుకుని కాజేశారు.
మండలం మాగేచెరువు వీఆర్ఓ సోమశేఖర్నాయక్ తమ భూములు అమ్మి డబ్బుల విషయంలో మో సం చేశాడని గోరంట్ల మండలం కొడిగేపల్లి పంచాయతీకి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్కు ఫిర్యాదు చేశారు.
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన పరిగి చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సవిత మండల నాయకులకు సూచించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.
స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎనఎ్సఎ్స యూనిట్-2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం సోమవారంతో ముగిసింది.