Home » Peddapalli
తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు పిలుపు నిచ్చారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జయశంకర్ జయంతి తోపాటు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
రైతులకు సాగునీరు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందుపట్ల సునీల్రెడ్డి అన్నారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం జెఎన్టీయూ కళాశాలకు చెందిన విద్యార్థులను కలిసారు. ఫీజు బకాయిలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతీ రోగికి నాణ్యమైన వైద్య సేవలను సకాలంలో ఆందేలా వైద్యాధికారులు, సిబ్బంది పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ అసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు.
పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు అన్నారు. మండలంలోని గంగారం, ఊషన్నపల్లి గ్రామాల్లో బుధవారం రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.32 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని, కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు.
ఉద్యానవన పంటలు సాగు చేస్తేనే రైతులకు అధిక లాభాలు వస్తాయని ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి రాము అన్నారు. మంగళ వారం రాఘవాపూర్, పెద్దబొంకూర్ గ్రామా ల్లోని పామాయిల్, బీర, కీరదోస, కూరగాయ తోటలను పరిశీలించారు.
జైలుభరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీ జ్యోతి పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలుభరో కార్యక్రమంపై ముద్రిం చిన కరపత్రాలను మంగళవారం కాలేజీ గ్రౌండ్లో ఆవిష్కరించారు,
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, మొదటి ఆరునెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం వల్ల శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజె క్టు అధికారి అనిత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్స వాలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకా న్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరో పిస్తూ సోమవారం ఏబీవీపీ నాయకులు పట్ట ణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు.