Home » Peddapalli
పెద్దపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం సబ్బితంలో రూ. 6 కోట్లతో గౌరి గుండాల జలపాతం అభివృద్ధి పనులకు, గౌరెడ్డిపేటలో రూ. 43లక్షలతో ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యేచింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు.
రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు అమలు చేస్తామని గోదావరిఖని ఏసీపీ రమేష్ హెచ్చరించారు. సోమవా రం వన్టౌన్ పోలీస్స్టేషన్లో సబ్ డివిజన్ రౌడీషీ టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 17తో చిన్న తరహా కాంట్రాక్టర్ల పాలిట శాపంగా మారిం దని, తక్షణమే దానిని రద్దు చేయాలని బీసీ జేఏసీ జిల్లా చైర్పర్సన్ దాసరి ఉష డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను 2002 ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఆయన జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
స్కాలర్షిప్ మంజూరు కోసం కావా ల్సిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకు న్నా ఇవ్వడం లేదని సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెం దిన బి హన్సిక కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. సోమవారం కలెక్టరే ట్లో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
సింగరేణి యాజ మాన్యం బొగ్గు ఉత్పత్తిపై కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యేటేటా ఉత్పత్తి పెంచుతూ పోతున్న సింగరేణి ఈయేడు 74 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 60మిలియన్లకు కుదించింది. గతంలో 44అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఉండగా క్రమంగా మూసివేతకు గురవుతూ 21కి చేరుకున్నాయి. మూతపడిన బొగ్గు గనుల్లో మిగిలిన బొగ్గు నిల్వలను వెలికి తీసేందుకు మెగా ఓసీలను యాజమాన్యం రూపొందించుకు న్నది.
మంథని డివి జన్లోని అటవీ గ్రామాల ప్రజలు తునికాకు సేక రణకు ఎదురు చూస్తున్నారు. యేటా వేసవిలో తునికాకు సేకరణ అటవీ గ్రామాల ప్రజలకు ఆర్థిక చేయూత ఇస్తుంది. యేటా ఏప్రిల్ 3వ వారంలో ప్రారంభమై దాదాపు నెల రోజుల పాటు అటవీ గ్రామాల్లో సందడిగా కొనసాగే తునికాకు సేకరణ ఈ సంవత్సరం ఆలస్యమైంది.
ఆర్ఎఫ్సీ ఎల్ వివాదంపై ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యంతో మాట్లాడారు. కార్మికుల సమస్యలు, వీర్లపల్లి పునరావాసం, ఆర్ఎఫ్సీఎల్కు యూరియా బ్యాగులను స్వశక్తిసంఘాల ద్వారా సరఫరా వంటి అం శాలు చర్చకు వచ్చాయి.
సుల్తానాబాద్ ప్రాంతంలోని రైస్మిల్లుల వద్ద ఎక్కడ పడితే అక్కడ ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లారీలు నేరుగా వారికి కేటాయించిన రైస్మిల్లులకు చేరుకుంటున్నాయి. మిల్లర్లు ధాన్యం బాగాలేదనే చెపుతూ అనధికారికంగా కటింగ్ పెడుతూ ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవడం లేదు.
జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారిక మద్యం షాపులతో పాటు అంతకు 10 రెట్లలో గ్రామాలలో అనధికార బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో ఎక్సైజ్శాఖకు ఆదాయం కూడా రెట్టింపుగా సమకూరుతున్నది.