Home » Peddapalli
సేవ్ సింగరేణి పోరు జాత పేరిట కార్మికులను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు ఏఐటీ యూసీ తెర లేపుతుందని ఆర్జీ-3 ఉపాధ్య క్షుడు కొటరవీందర్రెడ్డి ఆరోపించారు. సింగ రేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసి పి-2లో ఏర్పాటు చేసిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు.
మహిళలకు సింగరేణి సేవా సమితి అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకొని సింగరేణి సేవా సమితి, లేడిస్ క్లబ్ ఆధ్వర్యంలో బంగ్లాస్ ఏరియాలో గురు వారం రాత్రి సేవా సమితి అధ్యక్షురాలు డీ అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.
సింగరేణి సంస్థలో అవసరానికి మించి అదనపు కార్మికులు 7వేలకు పైగా ఉన్నారని సంస్థ అంచనాకు వచ్చింది. వీరందరిని తొలగించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నది. గత సంవత్సరంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం, వారసత్వ ఉద్యోగా లను నిలిపివేయడం, కొత్త నియామకాలు లేకపోవడం వెనక అసలు మతలబు అవసరానికి మించి కార్మికులు ఉండడమనేది తేట తేల్లమవు తున్నది.
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో డెన్మార్క్కు చెందిన హల్దర్ టాప్స్ కంపెనీ సమకూర్చిన టెక్నాలజీ విఫలమైంది. కీలకమైన రూ.200కోట్ల విలువైన హై టెంపరేచర్ రిఫార్మర్(హెచ్టీఆర్) యంత్రం ఫెయిల్ అయ్యింది. దీని ప్రభావంతో గత ఖరీఫ్ సీజన్లో పరిశ్రమ షట్డౌన్ అయ్యింది.
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ప్రజలకు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్లో ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యులకు సూచించారు. గురువారం గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగాలు, క్రిటికల్ కేర్ సెంటర్, ఎక్స్రే, అల్ర్టా సౌండ్, ఫిజియోథెరపి, చిన్నపిల్లల విభాగాన్ని పరిశీలించారు.
సింగరేణి కారుణ్య నియామకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని, అనవసర నియామకాలు చేశారని వస్తున్న అభియోగాలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంటుందనే ప్రచారం సింగరేణిలో కలకలం సృష్టిస్తున్నది. గత ప్రభుత్వ కాలంలో మెడికల్ అన్ఫిట్ కేసుల్లో ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా విధులకు అనర్హులుగా గుర్తిస్తూ వారసులకు ఉద్యోగాలు కల్పించారనే అభియోగాలు ఇప్పుడు సింగరేణిలో కల్లోల్లాన్ని కలిగిస్తున్నాయి.
సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీ యూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల్లో నడుస్తున్న ఎలక్ర్టిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే నడిపించా లంటూ మంగళవారం గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్కుమార్ సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.