Home » Peddapalli
మహాశివరాత్రికి గోదావరిఖనిలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో వారం రోజుల ముందు నుంచే ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. కోదండ రామాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నర్సా పూర్లో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలం గాణ గ్రామీణ బ్యాంకు నర్సాపూర్ శాఖ ఆధ్వ ర్యంలో సదస్సులో బ్యాంకు అధికారులు ఖాతాదారులకు సైబర్ క్రైమ్ మోసాలపై వివరించారు.
ఓదెల శైవక్షేత్రంలో శుక్రవారం బ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఆలయంలో అర్చకులు ఉదయం పూజలు నిర్వహించిన తర్వాత నూతన వధూవరులు భ్రమ రాంబ మల్లికార్జునస్వామిని కల్యాణ వేదికపై ఆసీనులు చేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవ మూర్తులకు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిం చాలని, వైద్యులు సమయపాలన పాటించా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్ర వారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.
రామగుండం ప్రజలు అభి వృద్ధికి పట్టం కట్టారని, ఇది రామగుండం ప్రజలు, సింగరేణి కార్మిక కుటుంబాల విజయమని, వారికి పాదాభివందనాలు చేసుకుంటు న్నానని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
రామగుండం నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై విపక్ష బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో తమకు 20 నుంచి 25శాతం సీట్లు వస్తాయని లెక్కలు కడుతున్న ఆ పార్టీ నాయకులు క్యాంపులు మొదలుపెట్టారు.
పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలి టీలో మెజారిటీ వార్డు స్థానాల్లో గెలుపొందుతున్నామని, మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని జాతీ య కార్మికసంఘాలు గురువారం తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మె సింగరేణిలో విజయవంతం అయ్యింది. సంస్థలోని 40వేల మంది కార్మికులు ఈ సమ్మెను సమర్థిస్తూ గురువారం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
రామగుండం మున్సిపల్ కార్పొరే షన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోదావ రిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు.