Home » Peddapalli
సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు, జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఆదివారం రాఘవపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో గెలుపొందిన సుమారు 206 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు, 56 మంది జర్నలిస్టులను సన్మానించారు.
కోల్బెల్ట్ ప్రాంతంలో పలు రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్న తారా ఆర్ట్స్ అకాడమీ సేవలను పలువురు ప్రశంసించారు. హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గోదావరిఖనిలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఉగాది కళోత్సవాలలో నల్లవజ్రం, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం, కమిటీల నియామకంలో జాప్యం చేస్తుండడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటించింది.
వేసవి ప్రతాపం మార్చిలోనే మొదలైంది. భగ్గుమంటున్న ఎండల్లో ప్రజలు ఇబ్బందులు పడవద్దని ఉద్దేశంతో రేషన్ లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం అందించడానికి పౌరసరఫరాల శాఖలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా మొదలైంది.
జిల్లాలో రెండేళ్లుగా స్థానిక నదులు, వాగుల ద్వారా ఉచితంగా తీసుక వెళుతున్న ఇసుక రవాణాకు చెక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుక వచ్చిన ఇసుక పాలసీని రాష్ట్ర మంతటా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికే సరఫరా చేస్తారు. ఇసుక కోసం బుకింగ్ చేసుకున్న వాళ్లకే ఆయా వాగులు, నదుల నుంచి అనుమతించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక డిప్యూటీ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ ఆరోపిం చారు. శనివారం ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందన్నారు.
రైతులు అందించే తోడ్పాటు వల్లనే ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు బలోపేతం అయ్యాయని ధూళికట్ట పీఎసీఎస్ పర్సన్ ఇన్చార్జి హైమద్ అలీ అన్నారు. శనివారం రైతువేదికలో ధూళికట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశంలో ముఖ్యఅతిథిగా మాట్లా డారు.
సంక్షేమ హాస్టళ్ల నిర్వ హణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలి పారు. శనివారం కలెక్టరేట్లో హాస్టల్ వార్డెన్లతో సమీక్ష నిర్వహించారు. మాట్లాడుతూ పిల్లలు భోజనం చేసే సమయంలో వార్డెన్లు తప్పకుండా హాస్టల్లో ఉండాలని, స్టడీ అవర్స్లో అందుబాటులో ఉండాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. అరైవ్, అలైవ్ ఫేస్-3 కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గోదావరిఖని కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని వేలాది మంది భక్తజనం కన్నులారా వీక్షించారు. జైశ్రీరాం నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది.