Home » Peddapalli
వీ-హబ్ భవన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన పెద్దపల్లి మండలంలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వి-హబ్ భవనాన్ని పరిశీలించారు.
జిల్లాలో రైతులకు గత సీజన్లో లాగా ఎరువుల కొరతకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో యాసంగి సీజన్లో ఎరువులు, ముఖ్యంగా యూరియా కొరత రాకుండా, లేకుండా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రణాళికలు రూపొందించి పటిష్టంగా అమలు అయ్యేలా అధికారులను ఆదేశించారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఐఎన్టీయూసీ నిరంతరం పోరాటం చేస్తుందని వైస్ప్రెసిడెంట్ నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంథని కూరగాయాల మార్కెట్ను తాత్కాలికంగా తరలించడానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం మార్కెట్లో కూల్చివేతలు ప్రారంభించి ఒకపక్కన్న ఉన్న షెడ్లను ఎక్స్వేటర్తో కూల్చివేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో షెడ్లకూల్చివేతలు కొనసాగుతాయని చిరువ్యాపారు లను హెచ్చరించారు.
మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తు న్నది. శనివారం రాత్రి గోదావరినది దాటి లింగాపురం గ్రామశ్మశానవాటిక సమీపంనుంచి మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాంతంలో ప్రవేశించింది. బొగ్గుఉత్పత్తి నిలిచిపో యిన తరువాత నాలుగేళ్లుగా వేలఎకరాల విస్తీర్ణంలో మేడి పల్లి ఓసీపీ ప్రాంతమంతా అడవిని తలపించేలా చెట్లుపెరిగాయి.
జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రత్యర్థులపై పై‘చేయి’ సాధించారు. మొదటి విడతలో జరిగిన మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ హవా రెండవ విడతలోనూ కొన సాగింది. కాంగ్రెస్ పార్టీ 51 స్థానాలు, బీఆర్ ఎస్ పార్టీ 14 స్థానాలు, స్వతంత్రులు 6 స్థానాల్లో, సీపీఐఎంఎల్ ప్రజాపంథా నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు గెలిచారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 111 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆయా గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోలింగ్ సామగ్రితో గ్రామాలకు చేరుకున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరో ఘట్టం ఆదివారం ముగిసిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత పోలింగ్, ఫలితాల వెల్లడికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. శనివారం మలి విడతలో ఎన్నికలు జరిగే తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయిన్పల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రితో పల్లెలకు చేరుకున్నారు.
జిల్లాలో ఈ నెల 14వ తేదీన జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రిని తమకు కేటాయించిన వాహనాల్లో తీసుకవెళ్లారు.
సింగరేణి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఆర్జీ-1 సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్కుమార్ పిలుపునిచ్చారు. శనివా రం ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో గోదావరి ఖనిలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, డ్యాన్స్ మస్టర్లు, సేవాసమితి సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.