Home » Pawan Kalyan
పవన్ కల్యాణ్ అత్యంత అరుదైన ఘనత సాధించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం చేశారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.
వైద్యులు బిజీగా ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక రోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు ముందు ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వంద మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుందని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను ఆ అంజన్నే కాపాడారని కామెంట్ చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లి నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కొండ గట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి రేపు (శనివారం) ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలు చేయనున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అతి త్వరలో అరకులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కానుంది. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణం జరగనుంది.
చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన కూటమి ప్రభుతానికి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెల్లువెత్తితే.. ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకు క్యూ కట్టాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను కలిశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.