Home » Pawan Kalyan
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త వసంతరాయలు కుటుంబాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. కుటుంబసభ్యులు వసంతరాయలు అవయవాలను దానం చేసి ఐదుగురికి కొత్త జీవితం ఇచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు.
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ భీమన్న ఖండ్రే మృతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు.
కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలమని పవన్ అన్నారు.
తెలుగు ప్రజలందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రతి ఇంటా పండుగ సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
పవన్ కల్యాణ్ అత్యంత అరుదైన ఘనత సాధించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం చేశారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.
వైద్యులు బిజీగా ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక రోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు ముందు ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వంద మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుందని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను ఆ అంజన్నే కాపాడారని కామెంట్ చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లి నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.