Home » Pawan Kalyan
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
విజయవాడలో టీడీపీ-బీజేపీ-జనసేన (ఎన్డీయే) కూటమి చేపట్టిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడం బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేడు (బుధవారం) రంగంలోకి దిగారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అప్పు తెచ్చి సంపదను తన వద్దే కేంద్రీకృతం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే సంపద సృష్టించొచ్చని అభిప్రాయపడ్డారు.
వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరో సంచలనానికి దారితీశారు. ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది..? ప్రచారానికి పోతే ఏంటి.. పోకపోతే ఏంటనుకున్నారో ఏమో కానీ మీడియా ముందు వాలిపోయారు. ఇక గొట్టాల ముందుకు వస్తే ముద్రగడ ఎలా మాట్లాడుతారో తెలుసు కదా. యథావిధిగా తన నోటికి పనిచెప్పారు. బాబోయ్.. ఆయన మాట్లాడుతుంటే అది నోరా.. తాటిమట్టా అన్నట్లుగా సొంత పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ జనసేనాని ప్రచారంలో దూసుకెళ్తునే ఉన్నారు. దీనికి తోడు ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారం చేపట్టాలని కూటమి భావిస్తోంది. లోక్ సభ సీట్లు ఎక్కువ గెలవాలని టార్గెట్ విధించుకుంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఏపీలో పర్యటించారు. రేపు మరోసారి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఎన్టీఏ కూటమి విజయవాడలో బుధవారం రోడ్ షో నిర్వహించనుంది.
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే.. పవన్ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం ఎన్ఆర్ఐలు తరలివస్తున్నారు. జనసేనాని, అభ్యర్థలు కోసం యూకే, కెనడా నుంచి ఎన్ఆర్ఐలు ఏపీకి విచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనడా నుంచి శంకర్ సిద్ధం, యూకే నుంచి వెంకటేష్ అనే ఎన్ఆర్ఐలు పెందుర్తికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. 160 అసెంబ్లీ, 25 లోక్సభ, సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని హెచ్చరించారు.