Home » Pakistan
పాకిస్థాన్ వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు చనిపోవడంపై ఆఫ్గన్ క్రికెట్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ చర్యను పూర్తిగా అనైతికంగా, అమానుషంగా ఆయన పేర్కొన్నారు.
పాక్ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు మరణించడంతో అప్ఘాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాక్, శ్రీలంకతో జరగాల్సిన ట్రైసిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
కాబూల్లోని టీటీపీ స్థావరాలపై పాక్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో ఆప్ఘనిస్తాన్ దళాలు విజృంభించాయి. సరిహద్దుల వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలటరీ పోస్టులపై దాడులు చేయటం మొదలెట్టాయి.
ఆసియా కప్ గెలిచినా కూడా ట్రోఫీ భారత్ చేతికి దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ట్రోఫీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. వచ్చే నెలలో ఏసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు భారత్, పాక్, ఇతర సభ్య దేశాలు హాజరుకానున్నాయి. కానీ ఈ మీటింగ్కు పీసీబీ చీఫ్ ముఖం చాటేస్తే ప్రతిష్టంభన మరింత కాలం పాటు కొనసాగొచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కొద్ది రోజులుగా సరిహద్దు ఘర్షణలతో అట్టుడికిన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాలిబన్ల వినతి మేరకు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. పాక్ విన్నపం మేరకే తాము కాల్పుల విరమణకు ఓకే అన్నామని తాలిబన్లు ప్రకటించారు.
కాందహార్ ప్రావిన్స్లోని పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 12 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య..
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు అఫ్గాన్ అధికారులు ధృవీకరించారు. పాక్ దాడికి దీటుగా తమ సైన్యం కూడా ప్రతిఘటిస్తోందని అఫ్గాన్ స్పష్టం చేసింది.
ఈ సారి మామూలుగా ఉండదు. ఊచకోతే.. అని పాకిస్థాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు భారత వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్. పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని..
చైనా తాజాగా పాకిస్థాన్ నుంచి రెండు వేల గాడిదలను కొనుగోలు చేసింది. పాకిస్థాన్ నుంచి చైనా అత్యధికంగా గాడిదలను దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో 2024లో ఈ రెండు దేశాల మధ్య డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం చైనాకు పాకిస్థాన్ 20 వేల గాడిదలను ఎగుమతి చేయాలి.
గాజాలో మరణాలు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ రణరంగంగా మారింది. గతవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.