Home » Odisha
ఒడిశాలో అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ తో పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలకు భారతీయ జనతా పార్టీ తెరదించింది. బీజేడీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఒడిశా అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే యోచనలో ఉన్నాయి. పొత్తు ఖరారైన పార్టీలు ప్రచారంలో వేగం పెంచుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకోగా.. ప్రాధాన్యతా క్రమంలో సీట్ల పంపకం జరిగింది.
ఈడీ(ED) అడిషనల్ డైరెక్టర్స్ అంటూ ఇద్దరు కేటుగాళ్లు 300 మంది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన ఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. ధెంకెనాల్ జిల్లాకు చెందిన తరినిసేన్ మోహపాత్ర (30), బ్రహ్మశంకర్ మహపాత్ర (27)లను రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ శనివారం అదుపులోకి తీసుకుంది.
నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసార జీవితం సాఫీగా సాగుతుంది. అయితే.. మగవారితో పోలిస్తే ఉద్యోగాలు చేసే ఆడవారు కాస్త ఎక్కువగా శ్రమిస్తుంటారు.
లోక్సభ ఎన్నికల వేళ నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశాలో బిజూ జనతాదళ్తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు.
అవయవాలు దానం చేసేవారిని గౌరవంగా సాగనంపాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒడిశాలో అవయవ దానం చేసిన ఎవరికైనా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
ప్రధాని మోదీ(PM Modi) తన కులం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ఒడిశా(Odisha)లోని ఝార్సుగూడలో భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharath Jodo Nyay Yatra)లో ఆయన మాట్లాడుతూ.. మోదీ ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి కాదని.. జనరల్ కేటగిరీకి(OC) చెందిన వారని ఆరోపించారు.
ప్రపంచంలోని తొలి బ్లాక్ టైగర్ సఫారీ త్వరలో ఒడిశాలో ప్రారంభం కానుంది. మయూర్భంజ్లోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సఫారీ ప్లాన్ చేస్తోంది.
ఒడిశా(Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో రెండు బైక్లు, ఆటో, ట్రాక్టర్, డీసీఎం ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.