Share News

అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..

ABN , Publish Date - Apr 28 , 2026 | 08:00 AM

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి, తన సోదరి ఖాతాలోని రూ. 19,300ను రాబట్టుకునేందుకు, ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మండుటెండలో మూడు కిలోమీటర్లు బ్యాంకుకు నడిచాడు.

అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..
Odisha shocking news

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి, తన సోదరి ఖాతాలోని రూ.19,300ను రాబట్టుకునేందుకు, ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మండుటెండలో మూడు కిలోమీటర్లు బ్యాంకుకు నడిచాడు. అందుకోసం సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది (Skeleton to bank India).


కియోంఝర్‌లోని దియానాలి గ్రామానికి చెందిన జితు ముండా అనే వ్యక్తి సోదరి కాక్రాకు మల్లిపాసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండేది. కాక్రా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం అంతకు ముందే మరణించారు. దీంతో కాక్రాకు కుటుంబ సభ్యుడిగా జితు మాత్రమే ఉన్నాడు. దీంతో తన సోదరి ఖాతాలో మిగిలిన రూ.19,300 విత్‌డ్రా చేసుకోవడానికి జితు బ్యాంకును సంప్రదించాడు. అయితే డబ్బు తీసుకోవాలంటే ఖాతాదారుడు తప్పనిసరిగా హాజరు కావాలని, లేదా మరణ ధ్రువీకరణ పత్రం గానీ, వారసత్వ పత్రాలు గానీ సమర్పించాలని చెప్పి, డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ నిరాకరించారు (Odisha shocking news).


చదువు లేని గిరిజనుడైన జితు వద్ద అలాంటి పత్రాలు లేవు (Bank withdrawal rules India). దీంతో సోమవారం నాడు శ్మశానవాటికకు వెళ్లిన జితు తన సోదరి అవశేషాలను బయటకు తీశాడు. అస్థిపంజరాన్ని గుడ్డలో చుట్టి బ్యాంకుకు తీసుకెళ్లాడు. జితు చేతిలోని అస్థిపంజరాన్ని చూసిన బ్యాంకు అధికారులు అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ శాంతపరిచారు. డబ్బు జితుకు చేరేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చ చెప్పారు.


ఇవి కూడా చదవండి..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..


బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 28 , 2026 | 08:30 AM