Home » NRI
డాలస్లో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్యర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా కూచిపూడి నృత్యం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన దుర్మార్గాలను ‘అరాచకంపై అక్షర సమరం’ పుస్తకంలో టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఎండగట్టారని వక్తలు కొనియాడారు.
అమెరికా, కెనాడలో చదువుకునే తెలుగు విద్యార్ధులకు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ఉపకారవేతనాలు అందిస్తున్నారు. 2023 నుండి ప్రతి సంవత్సరం అందిస్తోంది.
డెట్రాయిట్లో జరిగిన తానా 24వ మహాసభల వేదికపై జరిగిన ధీమ్తానా ఫైనల్స్ పోటీలకు మంచి స్పందన వచ్చింది. ధీమ్ తానా చైర్ నీలిమ మన్నె ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వివిధ నగరాల్లో రీజినల్ పోటీలను నిర్వహించారు. ఈ ప్రాంతీయ పోటీలకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్లో జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం 24వ ద్వైవార్షిక మహాసభలు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్లో జులై 3వ తేదీన వైభవంగా ప్రారంభమైంది. బాంక్వెట్ కార్యక్రమం, మహాసభల మొదటిరోజు కార్యక్రమాలకు దాదాపు 12వేలమంది రావడంతో నిర్వాహకులు ఉత్సాహంగా కనిపించారు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించాలని ప్రవాసాంధ్రులకు ఆయన పిలుపు నిచ్చారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణానికి అరుదైన గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) అందించే విశిష్ట పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలకు ఈసారి డెట్రాయిట్ వేదికైంది. జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరుగనున్నాయి.
వీసా రెన్యూవల్ కాకపోవడంతో సౌదీలో చిక్కుల్లో పడ్డ ఓ తెలుగు యువకుడికి అక్కడి ప్రవాసీయులు అండగా నిలవడంతో అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. అతడు స్వదేశానికి తిరిగెళ్లేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి.