Home » Nizamabad
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి తన కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే స్వార్థంతో పెంచిన ప్రేమను మర్చిపోయి కూతురిని హతమార్చిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఉదంతం అత్యంత బాధాకరం. విధి నిర్వహణలో ఒక మహిళా కానిస్టేబుల్పై ఇలాంటి దాడి జరగడం సభ్య సమాజాన్ని కలిచివేస్తోంది.
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా చంపింది భార్య. తన గుట్టు బయట పడకుండా హార్ట్ ఎటాక్తో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఏటీఎంలలో చోరీ చేసిన దుండగులు.. దాదాపు రూ. 50 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
కామారెడ్డిలోని సోమార్పేటలో ఎన్నికల కక్షలు భగ్గుమన్నాయి. ఓడిపోయిన సర్పంచి అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్తో ఢీకొట్టాడు.
ప్రేమించి మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా దొంచందకు చెందిన శ్రీకాంత్రెడ్డి, ఏరుగట్లకు చెందిన ఓ యువతితో ఆరేళ్లుగా ప్రేమలో పడ్డారు. ఇరువురూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని జేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. పావలా వడ్డీకి కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్లకు అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. గత రెండేళ్ల నుంచి ఇద్దరు సదరు మహిళను లైంగిక వేధిస్తున్నారు. దంత వైద్యుడు అమర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ పై నిజామాబాద్ సీపీ సాయి చైతన్యకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది
బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో అన్ని బాధ్యతలకు రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చానని కవిత చెప్పుకొచ్చారు.