Home » New Delhi
న్యూఢిల్లీని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టంగా పొగ అలుముకుంది. వాయు నాణ్యత సూచీ 439కు పెరిగింది.
పోలింగ్ అనివార్యమైతే జనవరి 20న ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడి ఎన్నికను ప్రకటిస్తామని లక్ష్మణ్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన న్యూఢిల్లీలో 28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పార్లమెంటరీ డెమాక్రసీలో స్పీకర్ పాత్ర ప్రత్యేకమైనదని ప్రధాని అన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని.. ప్రజాస్వామ్యం బలంగా మార్చిందని తెలిపారు.
ధన్ఖఢ్ ఈనెల 10న వాష్రూమ్కు వెళ్లినప్పుడు రెండు సార్లు స్పృహ కోల్పోయారని, వైద్య పరీక్షలు జరపాలని వైద్యులు సూచించడంతో చెకప్ కోసం ఎయిమ్స్లో చేరారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ మూడవ ఎడిషన్ విన్నర్ ప్రశాంత్ తమాంగ్ నేడు కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. ఆయన మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.
భారతదేశంపై గతంలో జరిగిన దాడులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రస్తావిస్తూ.. లెక్కకుమించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయని, గ్రామాలను దోచుకున్నారనీ, మన నాగరికతను అణిచివేశారని అన్నారు.
జనవరి 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఈ సమావేశాలు ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరుగుతాయని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరుగునుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని ఆయన కలుసుకున్నారు.
బయో ఇంధనాల వాడకం ద్వారా స్వయం సమృద్ధి భారత్ దిశగా మనం ముందుకు వెళ్లలేమా అని గడ్కరి ప్రశ్నించారు. తాను 100 శాతం ఇథనాల్తో కారును వాడుతున్నానని, ఇది 60 శాతం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తోందని, పొల్యూషన్ అనేదే లేదని చెప్పారు.
ఢిల్లీలో ఉంటున్న ఓ ఆఫ్రికన్ జాతీయుడిని నెల రోజుల్లోపు హిందీ నేర్చుకోవాలంటూ స్థానిక మహిళా కౌన్సిలర్ వార్నింగ్ ఇచ్చిన వైనం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.