Home » New Delhi
మోదీని అగౌరవపరిస్తే ప్రజలు ఎంతమాత్రం సహించరని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఆయన కుటుంబ సభ్యులను అవమానపరిచిన ప్రతిచోటా అక్కడ ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తూ వస్తున్నారని చెప్పారు.
ఢిల్లీలో నేటి ఉదయం వాయుకాలుష్యం పీక్స్కు చేరింది. రోహిణి ప్రాంతంలో ఏక్యూఐ సూచీ అత్యధికంగా 499 పాయింట్స్కు చేరింది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీఆర్ఏపీ-4 నిబంధనలను అమలు చేస్తోంది.
రాహుల్ గాంధీ పీఎంఓ కార్యాలయానికి ఒంటిగంట సమయానికి చేరుకున్నారు. 1.07 నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానంతరం అత్యున్నత పదవులకు మోదీ ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్టు రాహుల్ పేర్కొంటూ లిఖితపూర్వకంగా తన అసమ్మతి నోట్ను అందజేశారు.
సీఐసీలోని టాప్ పోస్టుల ఎంపికకు పీఎం సారథ్యంలోని కమిటీ బుధవారంనాడు సమావేశమవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇటీవల తెలియజేసింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ఈ కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది.
అడ్వకేట్ కిషోర్పై దాడికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే ఈ ఘటనపై కిషోర్ స్పందిస్తూ 30 నుంచి 35 ఏళ్లు వయసున్న ఒక యువ అడ్వకేట్ తనపై చెప్పుతో దాడి జరిపినట్టు చెప్పారు. మాజీ సీజేఐపై దాడి చేసినందుకే తనను శిక్షించాలని అనుకున్నట్టు వారు చెప్పారన్నారు.
భారతదేశ అభివృద్ధిలో నారీ శక్తి పాత్ర ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రతి రంగంలోనూ మన ఆడకూతుళ్లు తమదైన ముద్ర వేసుకుంటున్నారని, ఆటంకాలు తొలగించుకుంటూ దూసుకు వెళ్తున్నారని, గగనతలంలోనూ తమ శక్తిసామర్థ్యాలను చాటుకుంటున్నారని ప్రశంసించారు.
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది
ఇండిగో విమాన సర్వీసుల సామూహిక రద్దుతో తలెత్తిన సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య నమ్మకం అనేది గొప్ప బలమని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెబుతూ వచ్చామని, ప్రపంచానికి కూడా తెలియజేశామని అన్నారు.