Home » New Delhi
యూఎస్ నుంచి డిపోర్ట్ కాగానే అన్మోల్ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. 2022 నుంచి పరారీలో ఉన్న అన్మోల్కు ప్రస్తుతం జైలులో ఉన్న అతని సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని టెర్రర్ సిండికేట్తో ప్రమేయముంది.
అల్ ఫలాహ్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధీఖీని ఈడీ తాజాగా అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది.
బిహార్ తరహాలో కాకుండా ఈసారి ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు కనిపించినా లీగల్ టీమ్ల సాయంతో అభ్యంతరాలు తెలియజేయాలని, ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా అప్పీల్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు సూచించారు.
ఢిల్లీ పేలుడుకు ముందు పది రోజుల పాటు నిందితుడు డా. ఉమర్ హర్యానాలోని నూహ్ జిల్లాలో అద్దె ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానిక సీసీటీవీ కెమెరా ఫుటేజీలో కూడా అతడి కదలికలు రికార్డయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితుల కుట్ర ఏమిటో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బిహార్ ప్రజలు ఎన్డీయేకు చారిత్రక తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కట్టా సర్కార్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదంటూ విపక్ష కూటమికి చురకలు అంటించారు.
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశభద్రత కేవలం కేంద్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని అన్నారు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని, దేశంలోని ప్రతి వ్యవస్థ కంచుకోటగా నిలవాలని పిలుపునిచ్చారు.
ల్లీ పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన అంశాన్ని లేవనెత్తేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు ప్రయత్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసారు. అయితే అంశంపై చర్చ చేపట్టేందుకు కమిటీ చైర్పర్సన్ రాధా మోహన్ దాస్ నిరాకరించారు.
ఢిల్లీ పేలుళ్ల తరువాత కశ్మీరీ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయాడు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు 2023లోనే అక్కడి ప్రభుత్వం హసన్ను డిస్మిస్ చేసింది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితుడిగా ఉన్న డా.ఉమర్ గతంలో ఓ పేషెంట్ మృతికి కారణమైనందుకు జాబ్ పోగొట్టుకున్నట్టు జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడుతున్నాయి.
ఢిల్లీ పేలుళ్ల కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ను ముమ్మరం చేశాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో పట్టుబడ్డ మహిళా డాక్టర్ షాహీన్.. నిధుల సమీకరణలో కీలకంగా వ్యవహరించినట్టు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.