Home » New Delhi
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారంనాడు 10 జన్పథ్లో కలుసుకున్నారు. ఐక్యత, భాగస్వామ్య పార్టీల మధ్య మెరుగైన సమన్వయానికి పిలుపునిస్తూ ఇండియా కూటమి సమావేశం ముగిసిన మరుసటి రోజే ఉభయులూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని భారత్కు వచ్చినప్పుడు న్యూఢిల్లీ విమానాశ్రయంలో కొత్త లుక్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
కలిసికట్టుగా ఉంటేనే నిలబడాతామని, విడిపోతే పడిపోతామని లోక్సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని భాగస్వామ్య పార్టీలు గుర్తెరిగి, ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని నుంచి ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరగనున్న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కీలక సమావేశానికి శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే వర్చువల్గా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అధికారికంగా ప్రకటించారు.
ఈనెల 8న జరుగనున్న 'ఇండియా' కూటమి సమావేశంలో పాల్గొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆదివారంనాడు ఢిల్లీ బయలుదేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇండియా కూటమి తొలిసారి సమవేశమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రవేశ పరీక్షలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పరిష్కరించేందుకు ప్రస్తుత విద్యా వ్యవస్థలో సంస్కరించాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
భారత్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి బంధాలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మనీలాలో ఫలప్రదంగా ముగిసింది. ఇందులో ఐటీ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు.
బుధవారం ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో భవనంలో చిక్కుకున్న బాధితులు కిందకు దూకేందుకు వీలుగా నేలపై పరుపులను పేర్చి వారి ప్రాణాలను కాపాడిన తండ్రీకొడుకులపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.
రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్కు చేరుకుంది. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం కానుంది.
తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్షాను మంగళవారంనాడిక్కడ కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్ సంతోష్లతో తొలుత సమావేశమైన అన్నామలై తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించారు.