Home » New Delhi
సమాచార హక్కు (సహ) చట్టం కింద ఎన్నికల బాండ్ల వివరాలను అందజేసేందుకు ఎస్బీఐ నిరాకరించింది. ఇప్పటికే ఆ వివరాలన్నీ ఈసీ వెబ్సైట్లో ఉన్నప్పటికీ.. డబ్బుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారమైనందున బాండ్ల వివరాలను వెల్లడించలేమని ఎస్బీఐ తెలియజేయడం గమనార్హం.
భారత్లో బ్రిటీష్ హైకమిషనర్గా లిండి కామెరాన్ నియమితులయ్యారు. ఈ మాసంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు యునైటెడ్ కింగ్డమ్ హైకమిషన్ వెల్లడించింది. ఇప్పటి వరకు భారత్లో ఆ పదవిలో ఉన్న అలెక్స్ ఈలీస్ను బదిలీ చేసినట్లు వెల్లడించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరైట్ దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ వైభవ్ కుమార్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ లను ఈడీ సోమవారంనాడు విచారించింది.
జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సంఘీభావంగా ఆదివారంనాడు నిరాహార దీక్ష చేపట్టిన ఆ పార్టీ సరికొత్త థీమ్తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కేజ్రీవాల్ను జైలుకు పంపినందుకు ఓటుతో సమాధానం చెప్పండంటూ ''జైల్ కా జవాబ్ ఓట్ సే'' ప్రచారాన్ని సోమవారం ప్రారంభించింది.
లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను సీపీఐ విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారంనాడిక్కడ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చింది.
లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోనుంది. 'ఇండియా టీవీ-సీఎన్ఎక్స్' ఒపీనియన్ పోల్ ఈ వివరాలను వెల్లడించింది. ఢిల్లీ లోక్సభ ఎన్నికలపై బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ప్రభావం కానీ, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం కానీ పెద్దగా ఉండకపోవచ్చని ఒపీనియన్ పోల్ జోస్యం చెప్పింది.
బీజేపీ నేతలను ''దోపిడీదారులు''గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అభివర్ణించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ''భారత రత్న'' ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం ఉదయం స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ఒక 'సింహం' అని, ప్రభుత్వం ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ రాజీనామా చేయాలా అని 'ఇండియా' బ్లాక్ 'మహా ర్యాలీ'ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.
అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లకు సంఘీభావంగా ఆదివారంనాడు న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరుగనున్న ఆప్ 'మహార్యాలీ' లో 'ఇండియా' కూటమికి చెందిన ప్రముఖ నేతలు పాల్గోనున్నారు.