Home » New Delhi
ఢిల్లీకి చెందిన ఓ బాబాపై లైంగిక ఆరోపణల కేసు విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బేబీ, లవ్ యూ అంటూ బాబా అసభ్యకర వాట్సాప్ మెసేజీలను పెట్టిన మాట వాస్తవమేనని అధికారులు పేర్కొన్నారు.
జనాభాలో ఉద్యోగ ఉపాధి పొందే వయసున్న వారి వాటా అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. అక్కడ 15 -59 ఏళ్ల వయసున్న వారి వాటా 70.8 శాతం. ఆ తరువాతి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి.
ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.
ఏబీవీపీ కీలకమైన మూడు పోస్టులు సొంత చేసుకుంది. అధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకుంది. ఎన్ఎస్యూఐకి ఒక్క వైస్ ప్రెసిడెంట్ పదవి మాత్రమే తక్కింది.
ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎం. వెంకయ్యనాయుడు పక్కనే ధన్ఖడ్ కూర్చుని ఆయనతో సంభాషించడం కనిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ఆయన నవ్వుతూ గ్రీట్ చేశారు.
వివిధ కారణాల రీత్యా ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతా దళ్కు చెందిన ఏడుగురు రాజ్యసభ్యులు, కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి ముఖాముఖీ తలబడుతున్నారు. కాగా, వివిధ కారణాలతో తాము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి.
ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోటీ నెలకొంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.
పార్టీ విప్లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.