Home » Nellore
ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే టార్గెట్ చేశారు. డ్రైవర్ నిద్రపోతుండడాన్ని గమనించిన దొంగ చివరకు బస్సునే చోరీ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మాకు భయమంటే ఏంటో తెలీదంటూ బీరాలు పోయిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని కుబేరా సినిమా తరహాలో ఘరానా మోసానికి కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు.
Local Body Funds: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఇంటింటికీ వెళ్లి అధికారులు పంపిణీ చేశారని.. వాలెంటరీ వ్యవస్థ లేకుండానే అమలు చేశారని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్లో 28 వేల కోట్లు రూపాయలు ఇస్తామంటే, 2 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం వినియోగించు కోలేదని విమర్శించారు.
ఇండోసోల్ సోలార్ కంపెనీ కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది..
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ సోలార్ పరిశ్రమకు భూసేకరణపై రైతులకు ఎటువంటి అపోహలు వద్దని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు..
కొద్ది రోజులుగా ఎండలతో మండిపోతున్న కోస్తాలో బుధవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి.
Kotamreddy Question To Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి విలేకరుల సమావేశం అంటే ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారని, రాష్ట్రానికి మేలు చేసేవి చేస్తారని భావించానని... కానీ అబద్ధాలతో కూడిన మాటలు ఆశ్చర్యం వేసిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
Anam On YSRCP: కేంద్రం జలజీవన్ మిషన్కు గతంలో రూ.28 వేల కోట్ల నిధులు ఇచ్చిందని.. కానీ గత ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరించిందని మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో చర్చించి, మరో రెండేళ్ల కాలం పొడిగించేలా చేశారని తెలిపారు.
ఆగస్టు నెలలో తొమ్మిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017), ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018) రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.