Home » NEET Exam
పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం మున్నగునవి ఇందులో ఉన్నాయి.
ఎన్టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ నేడు ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధాని మోదీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.
నీట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరికీ ఈ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆల్ ది బెస్ట్ చెప్పింది.
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు
నీట్ రీటెస్టుకు సంబంధించి తనకు యూఏఈలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారని నాగ్పూర్కు (మహారాష్ట్ర) చెందిన ఒక విద్యార్థి తెలిపాడు. ఈ విషయాన్ని ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు విద్యార్థి తండ్రి చెప్పారు.
నీట్-యూజీ రీ ఎగ్జామ్కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షకు ...
త్వరలో జరగనున్న నీట్ రీటెస్టుకు సంబంధించి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు తక్షణ విచారణను చేపట్టేందుకు నిరాకరించింది.
ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్కు చుక్కెదురైంది. యాప్ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది.
నీట్ 2026 అభ్యర్థుల కోసం ఎన్టీఏ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 21 (ఆదివారం) జరగబోయే నీట్ రీ-ఎగ్జామినేషన్ సమాచారం ఇకపై నేరుగా వాట్సాప్ ద్వారా అభ్యర్థులకు అందనుంది.
నీట్-యూజీ 2026 రీ-టెస్ట్కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి..?