Home » National News
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సోమవారంనాడు తనపై దాడి జరిపినట్టు అదే పార్టీకి చెప్పిన రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మలివాల్ (Swamti Maliwal) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎట్టకేలకు స్పందించింది. సీఎం వ్యక్తిగత సహాయకుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు అంగీకరించింది.
రాజ్యాంగాన్ని మార్చనున్నారంటూ విపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగ పరిరక్షకుడనని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మంగళవారంనాడు నామినేషన్ వేసిన అనంతరం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మోదీ సమాధానమిచ్చారు.
భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం, రాజకీయ నేతలతోపాటు అనేక మంది చెబుతున్నారు. కానీ దేశంలో ఓటు వేయడాన్ని కచ్చితంగా అమలు చేయడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా(worldwide) చూస్తే మాత్రం పలు దేశాల్లో ఓటింగ్ తప్పనిసరి(Compulsory Voting) చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేయడంలో పేరున్న యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలాకు చేదు అనుభవం ఎదురైంది. నరేంద్ర మోదీ మంగళవారంనాడు నామినేషన్ వేసిన వారణాసి (Varanasi) నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని ఆయన ఆరోపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు వారాణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్డీయే భాగస్వామ్య నేతలతో కలెక్టరేట్ కార్యాలయం వెలుపల బలప్రదర్శన చేశారు. ఎన్డీయే కూటమి నేతలు తమ సంఘీభావాన్ని చాటుతూ మోదీ నాయకత్వంలో పనిచేయడం పట్ల హర్షం ప్రకటించారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసులో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు పెను బీభత్సం సృష్టించాయి. తేలికపాటి వర్షంతో పాటు బలమైన గాలులు వీచడంతో ఘట్కోపార్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ పేకమూడలా కుప్పకూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. సుమారు 57 మంది గాయపడ్డారు.
లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్ లో భారీగా పోలింగ్ నమోదైనప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బర్దమాన్-దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తృణమూల్ కాగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కల్నా గేట్లో బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది.
రాజకీయ ఉద్రిక్తతల నడుమ కేరళ లోని కన్నూరు జిల్లాలో సోమవారం ఉదయం బాంబు పేలుడు ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ పేలుడులో ఎవరూ గాయపడకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో చురుకుగా కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ 62.31 శాతం పోలింగ్ నమోదైంది.