Home » National News
చిన్న పిల్లలు తాగే ఫ్రూట్ జ్యూస్లు, మిల్క్ షేక్ల తరహాలో టెట్రా ప్యాక్లు, సాచెట్లలో వోడ్కా లిక్కర్ను విక్రయించడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. ఇది వినియోగదారులను, అభం శుభం తెలియని చిన్నారులను తప్పుదారి పట్టించడమే అవుతుందని పేర్కొంది.
ప్రభుత్వ భూములు రాయితీపై తీసుకున్న ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఉచిత చికిత్సను అమలు చేయడానికి విధివిధానాలను రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రైళ్లలో ఇటీవల జరిగిన వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉందని రైల్వే శాఖ తెలిపింది. అసాంఘిక శక్తుల ప్రమేయం ఇందులో ఉందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పేర్కొంది.
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని 'ద్రోహులు'గా పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని ఈనెల 21న విస్తరించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు, కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనే ఊహాగానాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం తోసిపుచ్చింది. తమ ప్రభుత్వానికి అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవని స్పష్టం చేసింది.
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి తాజాగా సీపీఎం హెచ్చరిక చేసింది. అన్నాడీఎంకే వర్గం ఎమ్మెల్యేల మద్దతు తీసుకువాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాము ఇంతవరకూ ఇస్తున్న మద్దతుపై పునరాలోచిస్తామని తెలిపింది.
బంగ్లాదేశ్లోని భారత మిషన్లో పనిచేస్తున్న ఒక ప్రోటోకాల్ అధికారి మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయం చిట్టగాంగ్లోని భారత సహాయ హైకమిషన్ కార్యాలయం నుంచి ప్రోటోకాల్ అధికారి నరేన్ ధర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
జేఎన్యూ మాజీ విద్యార్థి నేత, 2020 ఢిల్లీ అల్లర్లతో ముడిపడిన కుట్ర కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్కు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు నిరాకరించింది.