Home » National News
భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైలో భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి మెక్రాన్ ముంబైకి వచ్చారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఇంకా తేదీలను ప్రకటించనప్పటికీ మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశాలున్నాయి.
కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చిలైట్ గుర్తును భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు కేటాయించింది. 2026 పుదుచ్చేరి ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేసేందుకు ఈ గుర్తును కేటాయించినట్టు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
'కొడుకు లేని ఇల్లు మాకు వల్లకాడు' అని భావించిన ఓ దంపతులు.. మృత్యువులోనూ కుమారుడి చెంతకే చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది.
హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలోని ఎన్ఐటీలో తెలంగాణకు చెందిన విద్యార్థి సోమవారం ఉరి వేసుకుని మృతి చెందాడు.
టీవీకే అధ్యక్షుడు విజయ్ను విమర్శించే క్రమంలో నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ క్షమాపణలు తెలిపారు.
కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలైన శశిథరూర్, జైరామ్ రమేష్, పవన్ ఖేరాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టడీ మరణంపై కేసును చీఫ్ జస్టిస్ సారథ్యంలోని ధర్మాసనానికి ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు అప్పగించింది. ఈ కేసులో తనను దోషిగా నిర్ధారించడం, పదేళ్లు జైలు శిక్ష వేయడాన్ని ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ సవాలు చేశారు.
అసోం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా రాజీనామా వ్యవహారం మలుపు తిరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడటంతో తన రాజీనామా నిర్ణయంపై ఆయన వెనక్కు తగ్గారు.
మందిరంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల శ్రీ ధర్మాశాస్త ఆలయం దశాబ్దాలుగా నిరాకరిస్తోంది. దీనికి 2018లో అత్యున్నత న్యాయస్థానం స్వస్తి చెప్పింది.