Home » National News
రోడ్లపై తిరిగే జంతువులతో ప్రమాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. రోడ్లపై తిరిగే పశువులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జంతర్ మంతర్ ఆందోళనలో గాయపడిన ఢిల్లీ పోలీసుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ను సందర్శించే అవకాశముంది. ఇదే జరిగితే 2019 తర్వాత ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రాజకీయ చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన కమ్యూనికేషన్ వ్యూహాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతోంది.
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా మల్ధక్కా ప్రాంతంలో ఉన్న శీతల మాత ఆలయం, శివాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. రాత్రి వేళ ఇద్దరు దొంగలు రెండు ఆలయాల్లోకి చొరబడి హుండీలను పగులగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు.
ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా ఆర్ఏఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి క్రియేట్ చేసినట్టు వైరల్ అయిన వీడియోపై సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్పందించారు. ఆ వీడియోపై ఆమె క్షమాపణలు కోరారు.
గుజరాత్లోని జామ్నగర్లో భర్తకు సైనైడ్ ఇచ్చిన భార్య అతన్ని హత్య చేసింది. ఆపై ఓ పాడుబడిన ఫ్యాక్టరీలో 12 అడుగుల లోతులో పూడ్చిపెట్టింది. రెండేళ్లుగా భర్త ఆస్ట్రేలియాలో ఉంటున్నాడని, మాట్లాడటం కుదరదని కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మిస్తూ వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని భివండిలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ భవనం కూలిపోయి తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.
షట్టర్ తెరవలేదు.. తాళాలు పగులగొట్టలేదు.. కానీ తుమకూరులోని ఓ బంగారం దుకాణంలో చోరీ జరిగింది! ఏకంగా రూ.10 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయమయ్యాయి.