Home » National News
భారతదేశ ఇంధన భద్రతా పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని, ఇందుకు చేయాల్సినదంతా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురవారంనాడిక్కడ జరిగిన ఎన్ఎక్స్టీ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రస్తావించారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ప్రభావం పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొన్ని కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్లను విడుదల చేయనున్నట్టు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇండియాలో ఇంధన కొరత లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు, భారత నౌకల భద్రతకు సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రౌండ్లు చర్చలు జరిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ గురువారంనాడు తెలిపింది.
ఇంధన భద్రత విషయంలో కేంద్రం రాజీ పడిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో విపక్షాలు గురువారంనాడు నిరసనకు దిగాయి.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం తాలూకూ తీవ్ర ప్రభావాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైనా పడుతున్నాయి! చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి..
తమిళనాడులో కేంద్రం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని, ఇదే విషయం గతంలోనూ తాను చెప్పడం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతి డీఎంకే పాలనకు ఉద్వాసన పలకాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
రాజ్యాంగ వ్యవస్థలను దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనుంది. విపక్ష 'ఇండియా' కూటమికి చెందిన 180 మంది ఎంపీలు ఇందుకు సంబంధించిన నోటీసుపై సంతకాలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో బుధవారంనాడు వీగిపోయింది. విపక్ష ఎంపీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని తొలి దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చను ప్యానల్ స్పీకర్ జగదంబిక పాల్ చేపట్టారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ(బుధవారం) ప్రతిపక్ష పార్టీలు లోక్సభలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.