Home » National News
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళం అల్లాడిపోతోంది. వర్షాల ధాటికి సంభవించిన తీవ్ర నష్టం, కొండచరియలు విరిగిపడటం, వరద ఉధృతి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది మృతి చెందారు.
బిహార్లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన ఇవాళ (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఓ దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త నిబంధనలను అమలు చేయనుందా? ఇకపై వాట్సాప్ను వినియోగించాలంటే నిర్ణీత వయసు కలిగి ఉండాలా?
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం విషాదాన్ని నింపింది.
నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై ఆందోళనలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీజేపీ సంస్థ ఆగస్టు 5న కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.
బాలీవుడ్ స్టార్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో ‘సారీ హృతిక్’ అనే ట్రెండ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటులు వివేక్ ఒబెరాయ్, మాధవన్ గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికను క్షమిస్తున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆ బాలిక తల్లి ధన్యవాదాలు తెలియజేశారు.
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా ఇందిరానగర్లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ (ఆదివారం) ఓ కుటుంబం బలైంది. ఈరోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.