Home » National News
కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ బంధువు అయిన జ్యోతి మాంఝీ ఓపెన్ జీప్లో సిల్బట్టా ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొందరు ఆమెపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఒక రాయి ఆమెకు తగలడంలో గాయపడ్డారు.
హర్యానా ఎన్నికల్లో బ్రెజిలియన్ మోడల్ ఫోటోగ్రాఫ్ను వివిధ పేర్లతో వాడుకున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను కూడా రిజిజు తోసిపుచ్చారు. 25 లక్షల నకిలీ ఓట్లున్నాయని రాహుల్ చెప్పడాన్ని రాజకీయ ఉద్దేశాలతో అల్లిన డ్రామాగా ఆయన అభివర్ణించారు.
పౌరసత్వ వెరిఫికేషన్తో పాటు డూప్లికేట్లను, చనిపోయిన వారిని, చిరునామా మార్చుకున్న ఓటర్లను తొలగించేందుకు చేపట్టిన ఎస్ఐఆర్ను రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ఈసీ ప్రశ్నించింది.
పశ్చిమబెంగాల్ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు.
కోర్బా పాసింజర్ రైలు గూడ్సు రైలును ఢీకొనడంతో పాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్సు రైలుపైకి ఎక్కినట్టు ఘటనా స్థలికి చెందిన వీడియోల్లో తెలుస్తోంది. ఘటన జరిగిన పెద్దఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు.
టీవీకే అధ్యక్షుడు విజయ్ అక్టోబర్ 27న కరూర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదున్నరేళ్ల పాలనలో రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు జరగవచ్చని కొందరు ఊహాగానాలు చేస్తుండగా, కొందరు ఈ పరిణామాలను 'నవంబర్ రివల్యూషన్'గా పిలుస్తున్నారు.
ద్వివేది తమ స్వస్థలమైన రేవాలోని టీఆర్ఎస్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ, సరిహద్దులు, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం వంటి సవాళ్లతో పాటు కొత్తగా స్పేస్ వార్ఫేర్, శాటిలైట్, కెమికల్స్, బయోలాజికల్, రేడియోలాజికల్, సమాచార వార్ఫేర్ వంటి సవాళ్లలను సైన్యం ఎదుర్కొంటోందని ద్వివేది చెప్పారు.
బిహార్లో తగినంత వర్క్ఫోర్స్, వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బీజేపీ, నితీష్ ప్రభుత్వ భ్రష్టు పట్టించాయని బృందాకారత్ అన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు.
సీఎంతో మునుపటిలాగానే చక్కటి సమన్వయం కొనసాగుతోందని, అందరూ ఐక్యంతో ఉండటం వల్లే 136 నియోజకవర్గాల్లో గెలిచి 140కి బలం పెరిగిందని డీకే శివకుమార్ చెప్పారు.