Home » National News
నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.
ఆడ్వాణీ 98వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శశిథరూర్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆడ్వాణీని కలిసిన పాత పోటోను పోస్ట్ చేస్తూ, ప్రజాసేవ పట్ల ఆడ్వాణీకి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.
ఆడ్వాణీ బర్త్డే పోస్టులో ఆయనను తాను కలిసినప్పటి పాత ఫోటోను శశిథరూర్ పోస్ట్ చేశారు. నవీన భారతదేశ జర్నీలో ఆడ్వాణీ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న చెక్కుచెదరని సంకల్పం, వినయం, మర్యాద శ్లాఘనీయమని పేర్కొన్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ గత మేలో ఒక మహిళతో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఫేస్బుక్ పోస్టులో వెల్లడించడంతో ఆర్జేడీలో కలకలం రేగింది. దీంతో ఆయనను పార్టీ నుంచి ఆర్జేడీ బహిష్కరించింది.
ఆర్ఎస్ఎస్ భారత త్రివర్ణ పతాకాన్ని గౌరవించదని, కాషాయం జెండాలను మాత్రమే గౌరవిస్తుందని కొందరి అభిప్రాయంగా ఉందని అడిగినప్పుడు, ఆర్ఎస్ఎస్లో కాషాయాన్ని గురువుగా భావిస్తామని, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎంతగానో గౌరవిస్తామని మోహన్ భాగవత్ చెప్పారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
కల్యాణ్ బెనర్జీ అసాంసోల్ (దక్షిణ్) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2001-2006 మధ్య ఎస్బీఐలో ఖాతా తెరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఈ అకౌంట్ యాక్టివ్గా లేదు. 2025 అక్టోబర్ 28న సైబర్ మోసగాళ్లు ఆయన అకౌంట్కు అనుసంధానించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను మార్చారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
నితీష్ కుమార్ సీఎంగా ఉన్న మొదటి తొమ్మిదేళ్లు కేంద్రంలోని కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వం ఆయనను పనిచేయనీయలేదని, 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి కోసం మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామని మోదీ చెప్పారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఏఏఐబీ దర్యాప్తు స్వతంత్ర దర్యాప్తు కాదని అన్నారు. తన క్లయింట్ స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నారని చెప్పారు.