Home » National News
బడ్జెట్కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక నిర్మలా సీతారామన్ పక్కన పెట్టారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ద్రవ్యలోటు, పన్నుమార్పుల్లో కూడా తేడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మైనారిటీ హిందువులపై దాడులు, హత్యాకాండకు పాల్పడుతున్న బంగ్లాదేశ్కు కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో గట్టి పంచ్ ఇచ్చింది. ఏటా విదేశీ సాయం కింద కేటాయించే బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్ వాటాను సగానికి సగం తగ్గించింది.
ఎన్నికల కమిషన్కు 2025-26లో రూ.304.98 కోట్లు బడ్జెట్లో కేటాయించగా, 2026-27 బడ్జెట్లో ఈ మెుత్తాన్ని రూ.382.22 కోట్లకు పెంచారు.
21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా నడుస్తోందని, అందువల్ల సాంకేతికతను సామాన్యుడిగా కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు.
ఒక మలయాళీగా తనకు బడ్జెట్ సంతృప్తి కలిగించలేదని శశిథరూర్ అన్నారు. బడ్జెట్లో కేరళ ప్రస్తావనే లేకపోవడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.
బడ్జెట్లో కేంద్రం ప్రస్తావించిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టడం జరిగిందని, మూడు కారిడార్లంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని మమతా బెనర్జీ అన్నారు.
వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఫార్మా విద్యా, పరిశోధనకు జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.
సెమీ కండక్టర్ మిషన్కు భారీ కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్మాదపూర్వకంగా కలుసుకున్నారు.
దేశంలో వినియోగానికి ఊపునిచ్చి, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను కల్పించడం, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్ ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.