Home » National News
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరే సెక్టార్ పరిధిలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులు గాయపడ్డారు. వీరిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు.
పార్టీ ఎంపీల విధేయతకు సంబంధించిన వస్తున్న ఉహాగానాలపై శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మౌనం వీడారు. పార్టీని వీడాలని కోరుకునే వారు వెళ్లిపోవచ్చని చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర శ్వేతపత్రాన్ని మంగళవారంనాడు విడుదల చేసింది. డీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఖజానా ఖాళీ అయిందని ఆ శ్వేతపత్రంలో పేర్కొంది.
ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న 27 ఏళ్ల రాధా గాయత్రి ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె ముస్సోరీలోని హోమ్స్టే గదిలో విగతజీవిగా మారింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుదేలైన అన్నాడీఎంకేకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సి.విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు.
తృణమూల్ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో భవానీ పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారంనాడు సవాలు చేశారు. కోల్కతా హైకోర్టులో ఈమేరకు పిటిషన్ దాఖలు చేశారు.
నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ భద్రతా ఏర్పాట్లపై తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో రీ-ఎగ్జామ్ నిర్వహించేందుకు అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
లోక్సభలో విపక్ష నేత, తమిళనాడులో తమ మాజీ భాగస్వామి రాహుల్ గాంధీపై డీఎంకే ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ఒక పెద్ద జోక్ అంటూ విమర్శించింది. విపక్షాల ఐక్యతను ఆయన దెబ్బతీశారని ఆరోపించింది.