Home » National News
వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ మంచి అప్లికేషన్ అని, దీనిలో ఆడియో, వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్ తో పాటు అనేక ఫీచర్స్ ఉన్నాయని అనువాదిని సంస్థ సీఈఓ బుద్ధా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ యాప్లో ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆటలు ఆడుకోవచ్చని, ప్రభుత్వ పథకాల వివరాలు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీకి కాంగ్రెస్, రాహుల్ గాంధీ బి-టీమ్ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
డీఎంకేకు ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన తమిళగ వాళ్వూరియా కట్చి షాక్ ఇచ్చింది. డీఎంకే సారథ్యంలోని అధికార సెక్యులర్ అలయెన్స్ నుంచి వైదొలగుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు టి.వేలుమురగన్ ఆదివారంనాడు తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీనియర్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ప్రధానంగా కీలక రంగాలైన పెట్రోలియం, విద్యుత్, ఎరువుల పరిస్థితిపై ఈ భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఛత్తీస్గఢ్ జిల్లా మహాసముంద్ జిల్లాలో కొండపై నున్న ఆలయం నుంచి కిందకి వస్తున్న రోప్వే ట్రాలీ తెగిపడిన ఘటన ఆదివారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
జేడీయూకు రాజీనామా చేయడం ద్వారా సంచలనం సృష్టించిన ఆ పార్టీ అగ్రనేత కేసీ త్యాగి రాష్ట్రీయ లోక్దళ్లో ఆదివారంనాడు చేరారు.
ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ఎలాంటి విరామమూ లేకుండా 8,931 రోజుల పాటు సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా (గుజరాత్ సీఎం పదవీకాలం సహా) పని చేసిన వ్యక్తిగా నిలిచారు.
బొగ్గు ఉత్పత్తిలో భారత్ మరోసారి కీలక మైలురాయిని అధిగమించింది. ఈ నెల 20 నాటికి ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించినట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ తెలిపింది.
అన్ని విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఉచితంగా ఎంచుకునేందుకు కేంద్రం ప్రయాణికులకు కల్పించిన వెసులుబాటును దేశీయ విమానయాన సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, సహజవాయు మౌలిక వసతులపై దాడులు జరగటం, స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు ఆటంకాలు ఏర్పడటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.