Home » National News
బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎయిర్ గన్తో రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పలువురిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాడు. పలు వాహనాలు, సెక్యూరిటీ గార్డులపై పెల్లెట్ల వర్షం కురిపించడంతో టెకీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలుకీలక అంశాలపై మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్తంగా 'క్యా బోల్తీ పబ్లిక్' (ప్రజలు ఏమంటున్నారు) పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, సురేంద్ర గాడ్లింగ్ లాగానే తానూ రాజకీయ కక్షసాధింపునకు గురయ్యానని తెహెల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్పాల్ పేర్కొన్నారు. తెహెల్కా చేసిన దర్యాప్తు కథనాల వల్ల కొందరి రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలిగిందని, అందుకే తనపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.
తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు పదేళ్ల జైలు శిక్ష పడింది. 2013లో నమోదైన లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు గోవా బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.
విమాన ఇంధనంలో ఇథనాల్ కలిపే ప్రసక్తే లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు. ఇథనాల్ కలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
నాగ్పూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు, ఇంటర్ విద్యార్థినిని రెండు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
నీట్-యూజీ పరీక్ష విధానంలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
మెటా సంస్థపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లో తన ఖాతాను ఎందుకు నియంత్రించారని ఆయన ప్రశ్నించారు.
విదేశీ నిధుల నియంత్రాణ చట్ట సవరణ-2026 బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కొత్త బిల్లు పౌర సమాజంపై ప్రభుత్వ నియంత్రణను మరింత పెంచేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.