Home » National News
ఉదంపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం నాడు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జైషే మమ్మద్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ఉత్తరప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ కొరియన్ గేమ్ కారణంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మృతుల గదిలో పోలీసులకు లభించిన డైరీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ఆత్మహత్యకు పాల్పడిన కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ వద్ద పెద్ద సంఖ్యలో లగ్జరీ వాహనాలు ఉన్నా యి. ఆయన పాతికేళ్ల వయసులోనే తొలి వాహనం కొన్నారు.
మణిపూర్లోని కాంగ్పోక్పి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయిన కిప్గేన్ గత ప్రభుత్వంలో వాణిజ్యం-పరిశ్రమలు, టెక్స్టైల్స్, సాంఘిక సంక్షేమ శాఖలతో సహా పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం చేపట్టిన సన్నాహకాల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభా పక్ష నేతగా యుమునాం ఖేమ్చంద్ సింగ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకున్న మైత్రీ సంబంధాలను ఉపయోగించుకుని మనం పోటీ పడే అన్ని దేశాల కంటే బెస్ట్ డీల్ను ప్రధానమంత్రి మోదీ కుదుర్చుకున్నారని పీయూష్ గోయల్ తెలిపారు.
మంగళవారం నాడు లోక్సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో ఎన్డీయే కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్కు ఈ గౌరవం దక్కింది.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. ఈ విషయంలో న్యూఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదని చెప్పారు.
మహారాష్ట్ర బీజేపీ నేత, పర్యావరణ శాఖ మంత్రి పంకజ ముండేకు హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. మంగళవారం నాడు ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది.