Home » National News
పూర్ణియా పార్లమెంటు సభ్యుడు పప్పూ యాదవ్ ను పాట్నా పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు.1995 నాటి వివాదాస్పద భూముల కేసులో శుక్రవారం రాత్రి ఈ అరెస్టు జరిగింది.
చమురు అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది సమర్థవంతంగా అడ్డుకున్నారు. మూడు నౌకలను అదుపులోకి తీసుకున్నట్టు తీరప్రాంత భద్రతా అధికారులు శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి మహాయుతి కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డేను తమ అభ్యర్థిగా నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత అమిత్ సతమ్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని సోనేవాడి గ్రామసభ ఓ వినూత్న తీర్మానాన్ని ఆమోదించింది. భార్య చనిపోయిన పురుషులకు మహిళా వితంతువుల మాదిరిగానే సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వ పథకాలు మంజూరుచేయాలని కోరుతూ చేసిన తీర్మానానికి ఈ గ్రామసభ ఆమోదం తెలిపింది.
భారత్–అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారవడంతో సుంకాలు భారీ తగ్గనున్నాయి.
కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదంటూ ఎమ్మెల్సీ యంత్రీంద సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ఆయనే (యతీంద్ర) మా అధిష్టానం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
మైనర్గా ఉన్నప్పుడు గర్భవతి అయిన ఒక అమ్మాయి 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అనుమతించింది.
మహారాష్ట్ర - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఫొదేవా అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం ప్రారంభమైన ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో వీరమరణం పొందారు.
ఛత్తీస్గఢ్లోని పెద్దగెల్లూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత ధరమ్సింగ్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దాదాపు అన్ని ఉత్పత్తులపైనా భారత్ సుంకాలను సున్నాకు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.