Home » National News
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను అన్నాడీఎంకే బుధవారంనాడు విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.పళనిస్వామి మరోసారి తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి పోటీలో ఉన్నారు.
పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు.
ఢిల్లీ అసెంబ్లీకి బుధవారంనాడు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ బాంబు బెదిరింపులు రావడం గత 24 గంటల్లో ఇది రెండోసారి.
దేశ రాజధానిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి అధికారులు నోటీసు అందించారు. ల్యుటియన్స్ జోన్ ఖాళీ చేయాలని అక్బర్ రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎగ్జిట్ నోటీసు ఇచ్చారు. అలాగే 5వ నెంబర్ రైసినా రోడ్లోని యూత్ కాంగ్రెస్ ఆఫీస్ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు.
షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ)కు చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే.. అతడి ఎస్సీ హోదా తక్షణమే పూర్తిగా రద్దవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. తాను ఎస్సీనని అతడు చెప్పుకోజాలడని..
పశ్చిమాసియా ఉద్రిక్తతలను గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ పరిస్థితి కోవిడ్ తరహాలా ఉందంటూ పేర్కొనడంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన విషాదాల గురించి ఆయన మరిచిపాయారా? అని ప్రశ్నించారు
తెలుగు రాష్ర్టాల్లో వరకట్న వేధింపులకు గత ఐదేళ్లలో 1,304 మంది మహిళలు మరణించారని మంగళవారం లోక్సభలో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు..
దశాబ్దాలుగా కొనసా..గుతున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై వీలైనంత త్వరగా అడుగులు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా.. అంత తొందర ఏముంది.....
కుటుంబంలోని మహిళా పెద్దలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తామని, పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని విస్తరిస్తామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చింది.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు శుక్రు ఒడిశాలోని కొందమాల్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారంనాడు లొంగిపోయారు. మరో నలుగురు మావోయిస్టు సభ్యులతో కలిసి శుక్రు లొంగిపోయినట్టు డీజీపీ వైబి ఖురానియా తెలిపారు.