Home » Narendra Modi
పరీక్షల అక్రమాలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోమని ప్రధాని మోదీ చెప్పారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారికి త్వరితగతిన, శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు.
గత 10 ఏళ్లల్లో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్క కేసులో కూడా దోషులు ఎవరో తేలలేదని అన్నారు.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమావేశాలకు ముందు పార్లమెంట్ భవనం వెలుపల ప్రసంగిస్తూ రాహుల్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత తొలి ప్రైవేటు అంతరిక్ష ప్రయోగం 'విక్రమ్-1' విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతమైన వెంటనే హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ టీమ్కు ఫోన్ చేసి మాట్లాడారాయన.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను వచ్చే వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి ఎలాగైనా సంఖ్యా బలాన్ని కూడగట్టుకుని బిల్లులను గట్టెక్కించాలని పావులు కదుపుతోంది.
భారతదేశ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మొత్తం రూ.2,19,353 కోట్ల విలువైన ఏడు భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంపై కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను కార్యక్రమ నిర్వాహకులు ఖండించారు. ఈ విషయమై తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జానకి కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 'ఓం శాంతి' అంటూ నివాళులర్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో వారం రోజుల చరిత్రాత్మక పర్యటనను ఇవాళ విజయవంతంగా ముగించుకుని భారత్కు తిరుగుపయనమయ్యారు.
వియత్నాంలోని ఫు క్వాక్ దీవుల సమీపంలో ఘోర పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.