Home » Narendra Modi
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి - తిరువనంతపురం సూపర్ఫాస్ట్ రైలు కూడా ఉంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. భయమెరుగని నాయకత్వ పటిమకు ప్రతీకగా నిలిచే నేతాజీ జయంతిని యావత్ దేశం పరాక్రమ్ దివస్గా జరుపుకుంటోందని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు.
నితిన్ నబీన్ సిన్హా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం మొదటి సారి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ ఆధ్యక్ష పదవికి నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ప్రకటించింది. 45 ఏళ్ల వయసున్న నితిన్ నబీన్ ఈ పదవి అందుకోవడం ద్వారా పార్టీ చరిత్రలో అతి పిన్న అధ్యక్షుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లోని సింగూర్లో ఆదివారం పర్యటించారు. పర్యటన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలుగులోనే ట్వీట్ చేశారు. అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపే పండుగ ఇదని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి మోదీ నుంచి రిప్లై వస్తుందని ఆశించని ఓ మహిళకు ప్రత్యుత్తరం అందడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుడి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన శౌర్యయాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు..
గతేడాది ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోదీ ట్రంప్నకు ఫోన్ చేయకపోవడంతో అమెరికాతో డీల్ కుదరలేదంటూ యూఎస్ వాణిజ్య మంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.