Home » Nara Lokesh
తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు.
అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు.
మంత్రి నారా లోకేష్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించారు.
ఇటీవల వచ్చిన ఫలితాలు కొంతమేరకు నన్ను సంతృప్తి పరిచాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తేనే విద్యా శాఖ మంత్రిగా నాకు సంతృప్తి. అభ్యసన ఫలితాలపై అందరూ దృష్టి పెట్టాలి.
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024' కింద తొలి భారీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి అయ్యింది.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ డైనో డీట్స్ (Dino Deets) ప్రారంభించారు. అందుకు సంబంధించిన టీజర్ను ఆదివారం విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈసారి పరీక్షలో 91.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ నుంచి ఫైటర్ జెట్ తయారీ సంస్థల వరకు ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఉబర్ గ్లోబల్ లీడర్షిప్ టీమ్తో సీఎం చంద్రబాబు సమావేశం, చర్చించిన అంశాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగిందన్నారు.