Home » Nara Lokesh
అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన విజన్ అని లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.
ఏపీ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ (PM SHRI) పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సోమవారం హైదరాబాద్లోని తమ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఏపీ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగతున్నాయి. వర్షంలోనూ టాప్ గేర్లో నిర్మాణ కార్యకలాపాలు సాగిస్తున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేస్తూ.. సంబంధిత వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో నిర్వహించిన ‘డిజి 100 ఎక్స్ ఆంధ్రప్రదేశ్’ ఉన్నత విద్యా సదస్సుకు లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్వహించిన సభ విజయవంతమైంది.
మంత్రి నారా లోకేశ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేస్తూ, ఆయన కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు.
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. బాలకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.