Home » Nara Lokesh
వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ ( Nara Lokesh) హెచ్చరించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువగళ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్గా చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
యువగళం సారధి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగబోతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 30) నుంచి ఆయన సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు నిర్వహించనున్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్మిర్మాణం కోసం యువతను సంసిద్ధం చేయడమే లోకేశ్ తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు.
వైసీపీ మేనిఫెస్టోపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. మేనిఫెస్టో చూసి వైసీపీ అభిమానులు కూడా హార్ట్ అయ్యారు. పాత చింతకాయ పచ్చడిలా ఉందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శించింది. మేనిఫెస్టోపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత ఎన్నికలకు ముందే జగన్ రాజీనామా చేసినట్టు ఉందని విమర్శించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నారా లోకేశ్ ఖండించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఈ అంశంపై నారా లోకేశ్ స్పందించారు. సొంత చెల్లి కట్టుకున్న చీరపై కామెంట్ చేసిన సీఎం వైయస్ జగన్... నా తల్లిని వదులుతాడా? ఇంకెంత కాలం ఈ ఫేక్ ఎడిట్స్తో బ్రతుకుతావు జగన్? అంటూ నారా లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.
మంగళగిరి నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు ట్యాంకర్లను అనుమతించాలంటూ గుంటూరు కలెక్టర్కు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. వేసవి కారణంగా తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్దడిని ప్రభుత్వం పరిష్కరించకపోగా ఎన్నికల కోడ్ సాకుతో సేవా కార్యక్రమాలు అడ్డుకోవడం తగదని లేఖ రాశారు.
వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్పై రాయి దాడి అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో మరోసారి స్పందించారు. ఆ రాయి కోడికత్తి చరిత్రని తిరగ రాసింది. చీకట్లో లక్ష్యం తప్పకుండా ప్యాలస్ రాయి రెండు పిట్టల్ని కొట్టేసింది. లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజు రోజుకీ పెరుగుతోంది. 'కట్టు'కథ, కంటి.. న్యూస్.. ఈ కట్టు కథలు మే 13న కంచికి చేరతాయని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.
Andhrapradesh: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో మిర్చి కార్మికులతో బ్రహ్మణి భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆపై మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని బ్రాహ్మణి సందర్శించారు.
Andhrapradesh: జగ్గంపేట నియోజకవర్గంలో సూరంపల్లి ఆదిత్య కాలేజ్లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘‘జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?! జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యమన్నారు.
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు 75వ పుట్టినరోజు. ఈ వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో వైభవంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.
ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ పేర్కొన్నారు. నామినేషన్ వేసిన తనను నిత్యం వేధిస్తూనే ఉన్నారన్నారు. నిన్న తనపై ఓ యుద్ధానికి వచ్చినట్టు పోలీసులను పంపారన్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద తప్పుడు కేసులు పెట్టినట్టు.. ఇప్పుడు తనపై కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.