Home » Mustafizur Rahman
భారత్-బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి ఐసీసీ తెరదించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు ఐసీసీ అధికారులు ఢాకా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన ఓ అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది.
ఆదివారం వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై బీసీబీ తాజాగా స్పందించింది. అతడికి బీసీబీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
భద్రత కారణాల దృష్ట్యా రానున్న టీ20 ప్రపంచ కప్లో భారత్లో బంగ్లా ఆడనున్న మ్యాచ్ల వేదికలు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. బీసీబీ అభ్యర్థనను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశంపై ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డుకు ఓ కీలక సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని కేకేఆర్ జట్టు ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముస్తాఫిజుర్ పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడనున్నాడు.
పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ జట్టు ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్లో ఆడించొద్దంటూ డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ వెంటనే అతడిని జట్టులోంచి రిలీజ్ చేయాలంటూ కేకేఆర్ను ఆదేశించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే దీని కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.
ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ముస్తాఫిజుర్ తొలిసారి స్పందించాడు.
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తప్పించాలని కేకేఆర్కు బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.
ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్తో బంగ్లా ఆడే మ్యాచుల వేదికలు మార్చాలని ఐసీసీని సంప్రదిస్తున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ను ఐపీఎల్లో ఆడించొద్దని డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే.