Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ఔట్.. తొలిసారి స్పందించిన ముస్తాఫిజుర్ రెహమాన్
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:52 AM
ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ముస్తాఫిజుర్ తొలిసారి స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్లో హిందువులపై దాడి.. రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఆ దేశ ఆటగాడిని ఐపీఎల్లోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. వెంటనే అతడిని తొలగించాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీసీసీఐకి, కేకేఆర్ సహ యజామాని, ప్రముఖ నటుడు షారుక్ ఖాన్కు బెదిరింపులు కూడా వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెంటనే జట్టు నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేయాలని బీసీసీఐ(BCCI) కేకేఆర్కు ఆదేశాలు జారీ చేసింది.
దీని తర్వాత కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఘాటుగా స్పందిస్తూ వస్తుంది. తాము కూడా భారత్లో క్రికెట్ ఆడబోమని.. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్తో బంగ్లాకు ఉన్న మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. ఈ గందరగోళాల మధ్య ముస్తాఫిజుర్ రెహమాన్(Mustafizur Rahman).. జట్టు నుంచి తనను తప్పించడంపై తొలిసారి స్పందించాడు.
‘మిమ్మల్ని జట్టు నుంచి తీసేస్తే మీరు ఇంకా ఏమీ చేయగలరు? నేనూ అంతే’ అని బంగ్లా మీడియాలో మాట్లాడుతూ అన్నాడు. ప్రస్తుతం అతడి ప్రతిస్పందన వైరల్గా మారింది. గత నెలలో అబుదాబీలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముస్తాఫిజుర్ను రూ.9.2కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
అవమానాన్ని సహించం.. ఐపీఎల్పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?
138 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా!