Home » Municipal elections
నిజామాబాద్ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఏర్పడిన ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్నగర్, నల్లగొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. ఆయా కార్పొరేషన్లలో ఎన్నికైన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇవాళ జరగాల్సిన ఎన్నికలను అధికారులు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తమకు మేయర్ పదవి దక్కకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు గణనీయంగా పెరిగిందని పార్టీ సీనియర్ నేత ఎన్ రామచందర్ రావు తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు.
తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను వాయిదా వేయడం దుర్మార్గమని అన్నారు..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నిక చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో అధికారులు వాయిదా వేశారు.
నిర్మల్, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో భార్యాభర్తలకే చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడం విశేషంగా మారింది. ఈ ఫలితాలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి..
నిజామాబాద్ నగర మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ స్పందించారు.
కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. మేయర్గా సీపీఐ, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్లు దక్కించుకున్నారు.