కాంగ్రెస్ కుట్రలు చేసింది: బండి సంజయ్
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:04 PM
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తమకు మేయర్ పదవి దక్కకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్: కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును పక్కనబెట్టి కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీకి మేయర్ పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. బీజేపీ బలపడుతున్నందుకే కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు.
ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని అన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి మాటిచ్చానని, కరీంనగర్లో బీజేపీని గెలిపించి తన హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. కరీంనగర్ ప్రజలు ఎప్పటికీ బీజేపీతోనే ఉంటారని, భవిష్యత్తులో కూడా పార్టీ విజయాలను కొనసాగిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
కాగా, కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకుంది. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో ఆ పార్టీ నేత కొలగాని శ్రీనివాస్ మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా కూడా అదే పార్టీకి చెందిన సునీల్రావు అనే వ్యక్తి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మేయర్ పదవిని సాధించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి...
బుల్లెట్ రైళ్ల హబ్గా శంషాబాద్!
తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తం..
Read Latest Telangana News And Telugu News