Home » Mumbai
కండ్లా ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ సమయంలో చక్రం ఊడిపోయినా ప్రయాణం కొనసాగించిన ఓ స్పైస్ జెట్ విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండయ్యింది. విమానంలోని 75 మంది ప్రయాణికులు భద్రంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
మహారాష్ట్రలో డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ ఈగల్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన డెకాయ్ ఆపరేషన్ సంచలనంగా మారింది. డ్రగ్స్ హవాలా నెట్వర్క్ ను చేదించిన తెలంగాణ ఈగల్ పోలీసులు..
సంప్రదాయ ప్రకారం 18 అడుగులు ఎత్తైన లాల్ బాగ్చా రాజా గణేష్ విగ్రహం ఊరేగింపు అనంత చతుర్ధశి రోజున మొదలవుతుంది. మరుసటి ఉదయం 9 గంటల సమయంలో విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఈసారి కూడా అనుకున్న సమయానికే ప్లాన్ చేశారు.
భారతీయ యువ దర్శకురాలు అనుపర్ణ రాయ్ చరిత్ర సృష్టించారు. వెనీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 82వ ఎడిషన్లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు పొందారు. ఆమె సినిమా 'సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్'కు ఈ అవార్డు దక్కింది.
నిందితుడు అశ్వనీ కుమార్ వృత్తిరీత్యా జ్యోతిష్యుడు. పాట్నాలోని పాటలిపుత్రలో వాస్తు కన్సల్టెంట్గా ఉన్నాడు. గత ఐదేళ్లుగా నొయిడా సెక్టార్ 79లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతని తండ్రి సురేష్ కుమార్ పదవీవిరమణ చేసిన విద్యాశాఖ అధికారి.
ఈ రోజు 6500 వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఇది కేవలం గణపతి మండపాల్లో ఉంచిన వినాయక విగ్రహాల సంఖ్య మాత్రమే. ఈ పెద్ద విగ్రహాలతో పాటు 1.5 లక్షల ఇంటి గణపతుల నిమజ్జనం కూడా ఈ రోజే జరగనుంది.
ముంబై నగరంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లను మోహరించారు. అనుమానాస్పద వాహనాలను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
నిరసనకారులు షరతులన్నింటినీ ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ఆజాద్ మైదాన్లో ఉండటానికి బదులు సౌత్ ముంబైలోని అనేక కీలక ప్రాంతాల్లో గుమిగూడారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
సిటీ మొత్తం స్తంభించిపోతోందని, దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాలను నిరసనకారులతో నిండిపోతున్నాయని కోర్టు పేర్కొంది. కోటా నిరసలకు వ్యతిరేకంగా ఆర్మీ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్లతో కూడిన స్పెషల్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది.
ఆందోళనకారులు పెద్దసంఖ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్కు చేరుకోవడంతో ఆ ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నట్టు ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.